Nara Lokesh

Nara Lokesh: మంత్రి లోకేశ్‌ ఆసక్తికర పోస్ట్.. మధ్యాహ్నం 12 గంటలకు పెద్ద ప్రకటన!

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర ట్వీట్ పెట్టారు. ఆయన ‘ఎక్స్’ ఖాతా ద్వారా ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఒక పెద్ద ప్రకటన చేయనున్నట్లు తెలియజేశారు. ఈ ప్రకటనకు సంబంధించిన ఇప్పటి నుంచి రాజకీయ వర్గాలో, సామాజిక మాధ్యమాల్లో ఉత్కంఠమైన చర్చలకు దారితీసింది.

లోకేష్ ట్వీట్‌లో చెప్పినట్లుగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనలో తీసుకువచ్చిన సంస్కరణలు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన అవార్డు పొందినట్లు తెలిపారు. ఈ అవార్డును బలమైన, విశ్వసనీయ జ్యూరీ ఎంపిక చేసింది. అయినప్పటికీ, ఏ అవార్డు, ఎవరు విజేత అన్న వివరాలను మంత్రి ఈ మధ్యాహ్నం 12 గంటలకు వెల్లడిస్తానని పేర్కొన్నారు.

Also Read: Ram Suthar: భారత శిల్పకళా దిగ్గజం అస్తమయం.. రామ్ సుతార్ కన్నుమూత!

లోకేష్ వ్యాఖ్యలలో, “నినాదాలకంటే సంస్కరణలు గట్టిగా ఉంటే గుర్తింపు స్వయంగా వస్తుంది” అని పేర్కొని, ప్రభుత్వ విధానాలు ప్రజలకు గుర్తింపు పొందుతాయని సూచించారు. ఈ ట్వీట్‌ తరువాత రాజకీయ, మాధ్యమ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఇదొక ఆసక్తికర విషయం, ఎందుకంటే ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక విధానాలు ఇప్పుడు అంతర్జాతీయ, జ్యూరీ గుర్తింపు పొందడం ద్వారా మరింత ప్రతిష్ట పొందుతున్నాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *