Bhatti vikramarka: బీఆర్ఎస్ హయాంలో 38 % ఖర్చు పెట్టలేదు

Bhatti vikramarka: తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ హోరాహోరీగా సాగింది. ఈ సందర్భంగా డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం ఓటుబ్యాంకు రాజకీయాల కోసం మాత్రమే పనిచేసిందని, బడ్జెట్ నిధులను పూర్తిగా వినియోగించకపోవడం వల్ల ప్రజలకు తగిన ప్రయోజనం కలగలేదని ఆయన ఆరోపించారు.

“వాళ్ల హయాంలో బడ్జెట్‌లో కేటాయించిన నిధుల్లో 38 శాతం ఖర్చు పెట్టలేదు. ఆ నిధులను ఎవరికి కేటాయించారో చెప్పాలి. పదేళ్లపాటు బడ్జెట్‌లోని నిధులు ఖర్చు కాకుండా మిగిలిపోయాయి. ఆ నిధులు సంబంధిత వర్గాలకు అందలేదు,” అంటూ భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.

అదేవిధంగా, గత ప్రభుత్వ బడ్జెట్ వాస్తవ విరుద్ధంగా ఉండేదని ఆయన విమర్శించారు. “బడ్జెట్ ఊహల్లోనో, భ్రమల్లోనో ఉండకూడదు. మా ప్రభుత్వం ప్రజలకు వాస్తవాలు చెప్పాలని నిర్ణయించుకుంది,” అని ఆయన స్పష్టంచేశారు.

ప్రజా సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని, బడ్జెట్‌లో ఆ దిశగా తగిన చర్యలు తీసుకుంటున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. గత ప్రభుత్వ పనితీరుపై విమర్శలు చేస్తూనే, ప్రస్తుతం అందిస్తున్న నిధుల వినియోగం పూర్తి స్థాయిలో జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Sweets: స్వీట్ తిన్న తర్వాత నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *