Bhadrachalam: ఆలయ భూముల పరిరక్షణకు వెళ్లిన ఈవోపై దాడి – భద్రాచలంలో ఉద్రిక్తత

Bhadrachalam: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం భూముల పరిరక్షణకు వెళ్లిన కార్యనిర్వాహణాధికారి (ఈవో) రమాదేవిపై గ్రామస్థుల దాడి కలకలం రేపింది. అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు మంగళవారం పురుషోత్తపట్నం గ్రామానికి వెళ్లిన ఆమెపై కొందరు ఆక్రమణదారులు శారీరకంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆమె స్పృహతప్పి కుప్పకూలడంతో పరిస్థితి విషమించింది.

వెంటనే స్పందించిన ఆలయ సిబ్బంది ఆమెను భద్రాచలంలోని ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.

పురుషోత్తపట్నంలో భద్రాచలం దేవస్థానానికి చెందిన సుమారు 889.50 ఎకరాల భూమి ఉన్నట్లు అధికారికంగా పేర్కొనబడింది. ఈ భూములను దేవస్థానానికి తిరిగి అప్పగించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ, కొందరు స్థానికులు కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్నారు.

ఈ విషయంపై సమాచారం అందుకున్న ఈవో రమాదేవి, ఆలయ సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లి నిర్మాణాలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆక్రమణదారులు తీవ్రంగా ప్రతిఘటించడంతో వాగ్వాదం ఘర్షణగా మారింది. తోపులాటలో ఈవోపై జరిగిన దాడి స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారి తీసింది.

ఘటనపై పలువురు ప్రజాప్రతినిధులు, హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మహిళా అధికారిపై దాడి చేయడం దారుణమని, ఆలయ భూములను రక్షించాల్సిన బాధ్యతను నిర్విరామంగా నిర్వహించే అధికారులపై దాడులు తీవ్రంగా ఖండించాల్సినవని వ్యాఖ్యానిస్తున్నారు.

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  KCR: KCR నోట హరీష్ రావు పేరు వినగానే మార్మోగిన సభ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *