Bellamkonda Sai Sreenivas

Bellamkonda Sai Sreenivas: సినిమాలు మానేస్తానన్న బెల్లంకొండ: ఎందుకో తెలుసా?

Bellamkonda Sai Sreenivas: టాలీవుడ్‌లో హారర్ సినిమాలకు కొత్త ఊపిరి పోస్తూ ‘కిష్కింధపురి’ రాబోతోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రం గురించి హీరో బెల్లంకొండ సంచలన వ్యాఖ్యలు చేశాడు. సినిమా చూస్తూ ఫోన్‌లో మునిగితే సినిమాలు చేయడం మానేస్తానని అన్నాడు.

Also Read: Nawazuddin Siddiqui: బ్లైండ్ బాబుతో నవాజుద్దీన్ సిద్దిఖీ కొత్త అవతారం!

‘కిష్కింధపురి’ చిత్రం టాలీవుడ్‌లో హారర్ జానర్‌కు కొత్త ఒరవడిని తీసుకొస్తోంది. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం పూర్తిగా హారర్ అంశాలతో నిండి ఉంటుందని, ప్రేక్షకులను ఆద్యంతం ఆకర్షిస్తుందని బెల్లంకొండ ధీమా వ్యక్తం చేశాడు. సినిమా మొదలైన పది నిమిషాల్లోనే ప్రేక్షకులు కథలో లీనమవుతారని, ఒకవేళ ఫోన్‌లో మునిగితే సినిమాలు చేయడం మానేస్తానని ఆయన సవాల్ చేశారు. సెప్టెంబర్ 12న రిలీజ్ కానున్న ఈ చిత్రం ఈ హైప్‌ను నిలబెట్టుకుంటుందో లేదో చూడాలి. థియేటర్లలో ప్రేక్షకుల ప్రతిస్పందనే దీనికి సమాధానం చెబుతుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  NTR: స్కాట్ లాండ్ వీధుల్లో ఎన్టీఆర్!?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *