Vishaka Summit 2025: ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు స్వర్గధామం.. ఇక్కడ పెట్టుబడులు పెట్టండి.. అంటూ ప్రపంచ పెట్టుబడిదారులకు పిలుపు నిస్తున్నారు సీఎం చంద్రబాబు. వచ్చే నెల 14,15 వైజాగ్లో ఆంధ్రప్రదేశ్ భాగస్వామ్య సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది ఏపీ ప్రభుత్వం. గతంలో 2016,2017,2018లో వైజాగ్ కేంద్రంగా సీఎం చంద్రబాబు పెట్టుబడుల సదస్సు నిర్వహించారు. ఇప్పుడు వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు ప్రకటన ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఇప్పటికే పెట్టుబడుల సదస్సు రావాలని దేశ విదేశాల్లో ఉన్న ప్రపంచ దిగ్గజ పెట్టుబడిదారులకు ఏపీ ప్రభుత్వం అహ్వానాలు పంపుతుంది. ఇదే సమయంలో సీఎం చంద్రబాబు ఈ నెల 22 నుంచి 24 వరకు దుబాయ్లో పర్యటించనున్నారు. వచ్చే నెల 2 నుంచి 5 వరకు లండన్ పర్యటనకు సీఎం చంద్రబాబు సిద్ధమయ్యారు. ఇదే సమయంలో మంత్రి నారా లోకేష్ ఈ నెల 18 నుంచి 25 వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. వైజాగ్ భాగస్వామ్య సదస్సుకు రావాలని పెట్టుబడిదారులను సీఎం చంద్రబాబు స్వయంగా ఆహ్వానించనున్నారు.
లక్ష కోట్ల పెట్టుబడులతో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన వైజాగ్.. వచ్చే నెల మరో భారీ ఈవెంట్కు సిద్ధమవుతుంది.. వచ్చే నెల 14,15 రెండు రోజుల పాటు వైజాగ్లో పెట్టుబడుల సదస్సును భారీ స్థాయిలో నిర్వహిస్తోంది ఏపీ ప్రభుత్వం.. ఈ సదస్సు ద్వారా మరోసారి దిగ్గజ కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవడానికి ప్లాన్ చేస్తోంది.. దీనిలో భాగంగా సీఎం చంద్రబాబు ఈ నెల 22 నుంచి 24 వరకు దుబాయ్లో.. వచ్చే నెల 2 నుంచి 5 వరకు లండన్లో పర్యటించనున్నారు.. ఇదే సమయంలో ఈ నెల 18 నుంచి 25 వరకు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు.. అక్కడ భారీ స్థాయిలో రోడ్ షోలు నిర్వహించనున్నారు.. ఏపీలో భాగస్వామ్య సదస్సుకు రావాలని పెట్టుబడిదారులను నేరుగా అహ్వానించనున్నారు. ఇప్పటికే గత నెలలో మంత్రులు నారాయణ, బీసీ జనార్ధన్ రెడ్డి దక్షిణ కొరియాలో పర్యటించారు.. పెట్టుబడుల భాగస్వామ్య సదస్సుకు రావాల్సిందిగా పెట్టుబడిదారులను కోరారు.. పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ జపాన్లో పర్యటించారు.. ఇప్పుడు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ విదేశీ పర్యటనలకు సిద్ధమయ్యారు.
Also Read: Hyderabad: తెలంగాణలో మరో రెండు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు
ఇప్పటికే ప్రపంచంలోని పలు దిగ్గజ కంపెనీల ప్రతినిధులకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానాలు పంపింది. భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని ఐక్య రాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్కు ఏపీ సర్కార్ అహ్వానం.. ప్రపంచ దిగ్గజ సంస్థలైన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, ఎన్విడియా ప్రెసిడెంట్ & సీఈఓ జెన్సెన్ హువాంగ్.. రోల్స్ రాయిస్ సీఈఓ.. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ గవర్నర్, స్కాచ్ విస్కీ అసోసియేషన్ చైర్మన్, ఐకియా అధిపతికి, పెప్సీ చైర్మన్ లతో పాటు.. అనేక అంతర్జాతీయ బ్యాంకులు, వాణిజ్య సంస్థల అధిపతులకు ఏపీ ప్రభుత్వం ఆహ్వానాలు పంపింది.. ఇక పలు దేశాల అధినేతలకు అహ్వానం పంపారు.. ఇందులో సింగపూర్, మాల్డోవా, బల్గేరియా దేశాల ఉప ప్రధానులు విశాఖ సదస్సుకు హాజరవుతున్నట్లు ఏపీ ప్రభుత్వానికి సమాచారం అందింది.. ఇదే క్రమంలో 26 దేశాలకు చెందిన వాణిజ్య, పరిశ్రమ శాఖ మంత్రులు సదస్సుకు హాజరవుతున్నారు.. రాష్ట్రంలో విదేశీ విశ్వవిద్యాలయాల ఏర్పాటుపై దృష్టి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. పలు విదేశీ విశ్వవిద్యాలయాల ఉన్నతాధికారులను విశాఖ భాగస్వామ్య సదస్సుకు ఆహ్వానించింది.. వీరితో పాటు దేశీయ దిగ్గజ కంపెనీల అధిపతులైన ఆనంద్ మహింద్రా, టాటా చంద్రశేఖరన్, గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీ, కుమార్ మంగళం వంటి ప్రముఖులకు అహ్వానాలు పంపారు.. ఇప్పటికే కొందరు సదస్సు వస్తామని సమాచారం ఇవ్వగా.. మరికొందరు నుండి ఇంకా సమాచారం అందలేదు.