Babu London Tour Spl

Babu London Tour Spl: బాబు పెట్టుబడుల వేట.. సతీమణికి అవార్డుల పంట!

Babu London Tour Spl: వ్యక్తిగత పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరితో కలిసి శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి లండన్‌కు బయల్దేరి వెళ్లనున్నారు. నవంబరు 4వ తేదీన ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ, హెరిటేజ్ ఫుడ్స్ ఎండీ నారా భువనేశ్వరికి ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ లండన్‌లో డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్-2025 అవార్డు అందించనుంది. అలాగే, హెరిటేజ్ ఫుడ్స్‌కు ఎక్స్ లెన్స్ ఇన్ కార్పోరేట్ గవర్నెన్సు విభాగంలో లభించిన గోల్డెన్ పీకాక్ అవార్డును భువనేశ్వరి అదే వేదికపై అందుకోనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరు అవుతారు. విశిష్ట వ్యక్తిగా పేర్కొంటూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ నారా భువనేశ్వరిని డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు 2025కు ఎంపిక చేసింది. ప్రజాసేవ, సామాజిక ప్రభావం అంశాల్లో కీలకంగా పని చేసినందుకు గానూ ఈ డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డును సంస్థ ఆమెకు అందించనుంది. లండన్‌లోని గ్లోబల్ కన్వెన్షన్‌లో జరిగే కార్యక్రమంలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ నుంచి భువనేశ్వరి ఈ అవార్డును అందుకోనున్నారు. ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా సామాజిక సాధికారితకు పాటుపడుతున్న వ్యక్తిగా ఆమెను ఈ ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం, హిందూజా గ్రూప్ కో చైర్మన్ గోపిచంద్, ఆదిత్య బిర్లా సెంటర్ ఫర్ కమ్యూనిటీ ఇనిషియేటివ్స్ చైర్ పర్సన్ రాజశ్రీ బిర్లా, సన్ ఫార్మా ఎండీ దిలీప్ సంఘ్వీ, దుబాయ్ ఎలక్ట్రిసిటీ, వాటర్ అథారిటీ ఎండీ సయీద్ మహ్మద్, హీరో ఎంటర్ ప్రైజెస్, గోయెంకా గ్రూప్ సంస్థల చైర్మన్ సంజీవ్ గోయెంకా వంటి దిగ్గజ వ్యక్తులు గతంలో ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్నారు. ఇక ఎక్స్‌లెన్స్ ఇన్‌కార్పోరేట్ గవర్నెన్సులో హెరిటేజ్ ఫుడ్స్ ఎండీ హోదాలోనూ భువనేశ్వరి గోల్డెన్ పీకాక్ అవార్డు అందుకోనున్నారు. ఎఫ్ఎంసీజీ విభాగంలో హెరిటేజ్ ఫుడ్స్‌కు జాతీయ స్థాయిలో ఎక్స్‌లెన్స్ ఇన్‌కార్పోరేట్ గవర్నెన్సు విభాగంలో గోల్డెన్ పీకాక్ అవార్డుకు ఐవోడీ ఎంపిక చేసింది.

Also Read: Telangana: న‌వంబ‌ర్ 3 నుంచి కాలేజీల‌ బంద్‌కే మొగ్గు

చంద్రబాబు యూకే పర్యటన వ్యక్తిగతమైందే అయినా.. లండన్‌లో ఆయన తన వ్యక్తిగత వ్యవహారాల అనంతరం రాష్ట్రానికి సంబంధించిన పలు కార్యక్రమాల్లో సైతం పాల్గొననున్నారు. విశాఖలో ఈ నెల 14, 15 తేదీల్లో జరుగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు అక్కడి పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించనున్నారు. దీనికి సంబంధించి లండనవ్‌లోని పారిశ్రామికవేత్తలు, పలువురు ప్రవాసాంధ్రులతోనూ సీఎం భేటీ కానున్నారు. అన్ని కార్యక్రమాలను ముగించుకుని నవంబరు 6 తేదీన సీఎం తిరిగి రాష్ట్రానికి రానున్నారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *