Uttarakhand News

Uttarakhand News: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం, 57 మంది..

Uttarakhand News: ఉత్తరాఖండ్‌లో శుక్రవారం మంచు తుఫాను కారణంగా ఒక పెద్ద ప్రమాదం సంభవించింది. చమోలి జిల్లాలోని మానా గ్రామంలో మంచు పర్వతం కూలడం వల్ల 57 మంది కార్మికులు మంచు కింద చిక్కుకున్నారు.

వీరిలో అధికారులు కొంత 32 మందిని రక్షించారు. మరింత మంది కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. హిమపాతం కారణంగా ప్రభావిత ప్రాంతానికి వెళ్లే రహదారి మూసివేయబడింది. దీని కారణంగా రెస్క్యూ ఆపరేషన్‌లో ఇబ్బంది నెలకొంది.

ఉత్తరాఖండ్‌లోని మానా గ్రామంలో జరిగిన ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే, ఐటీబీపీ , ఆర్మీ సిబ్బంది గ్రామానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. SDR, NDRF బృందాలు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.

BRO శిబిరం దగ్గర ప్రమాదం :
బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) శిబిరం దగ్గర హిమపాతం సంభవించిందని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనలో 57 మంది కార్మికులు చిక్కుకున్నారని చమోలి డిఎం సందీప్ తివారీ తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. 10 మంది కార్మికులను రక్షించి, మానా సమీపంలోని ఆర్మీ క్యాంప్‌కు తరలించామని తెలిపారు.

కార్మికులు హైవే నిర్మాణంలో నిమగ్నమై ఉండగా ప్రమాదం:
ఉదయం 8 గంటలకు ప్రమాదం గురించి సమాచారం అందిందని బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) కమాండర్ కల్నల్ అంకుర్ మహాజన్ తెలిపారు. కాంట్రాక్టర్ కార్మికులలో కొందరు రోడ్డు (హైవే) నిర్మాణంలో నిమగ్నమై ఉన్నారు. మృతుల సంఖ్య ఖచ్చితంగా అస్పష్టంగా ఉంది. 10 మందిని రక్షించారు. కొంతమందికి తీవ్ర గాయాలు కాగా, వారిని చికిత్స కోసం తరలించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *