Arshdeep Singh

Arshdeep Singh: రూ. 3 కోట్ల పెట్టి డ్రీమ్ కారు కొన్న అర్ష్‌దీప్

Arshdeep Singh: భారత ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా పర్యటన నుంచి తిరిగి వచ్చిన వెంటనే తన కార్ల కలెక్షన్‌లో ఒక కొత్త లగ్జరీ కారును చేర్చుకున్నారు. ఆస్ట్రేలియా పర్యటన నవంబర్ 8న విజయవంతంగా ముగియగా, భారత్ 2-1 తేడాతో సిరీస్‌ను గెలుచుకుంది. అర్ష్‌దీప్ తన డ్రీమ్ కార్లలో ఒకటైన మెర్సిడెస్-బెంజ్ జి-క్లాస్ (Mercedes-Benz G-Class)ను కొనుగోలు చేశారు. ఈ కారు విలువ సుమారు రూ. 3 కోట్లు (ఎక్స్-షోరూమ్ ధర) ఉంటుందని అంచనా. ఈ కొత్త కారు ముందు నిలబడి ఉన్న ఫోటోలను, అలాగే తన కుటుంబ సభ్యులతో కలిసి ఉన్న ఫోటోలను అర్ష్‌దీప్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ వీడియోలో తన కలల కారును సొంతం చేసుకోవడం పట్ల ఆయన ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: Bigg Boss 9: బిగ్ బాస్ పదో వారం నామినేషన్స్‌లో.. ఆ ఒక్కరు మినహా అందరూ నామినేట్

26 ఏళ్ల ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఆస్ట్రేలియా పర్యటనలో మొత్తం రెండు వన్డేలు, మూడు టీ20ల్లో ఆడి, మొత్తంగా ఏడు వికెట్లు పడగొట్టారు. అర్ష్‌దీప్ ఇప్పటికే 67 టీ20 ఇన్నింగ్స్‌లలో 105 వికెట్లు తీసి, ఈ ఫార్మాట్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌లలో ఒకరిగా ఉన్నారు. అర్ష్‌దీప్ ఇప్పటివరకు 11 వన్డేలలో 17 వికెట్లు పడగొట్టారు, ఇందులో ఒక ఐదు వికెట్ల ప్రదర్శన కూడా ఉంది.టీ20 సిరీస్‌లో భారత్ వేర్వేరు కాంబినేషన్లను ప్రయత్నించడంతో అర్ష్‌దీప్ మొదటి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యారు. కానీ, చివరి మూడు టీ20 మ్యాచ్‌లలో ఆడే అవకాశం లభించింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *