AP News:

AP News: వైజాగ్‌, విజ‌య‌వాడ మెట్రో ప్రాజెక్టుల‌కు గ్రీన్‌సిగ్న‌ల్‌

AP News: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ప్ర‌ధాన న‌గ‌రాలైన వైజాగ్‌, విజ‌య‌వాడలో మెట్రో రైలు ప్రాజెక్టుల‌కు అక్క‌డి కూట‌మి ప్ర‌భుత్వం గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది. టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ క‌ల‌యిక‌తో ఏర్ప‌డిన కూట‌మి ప్ర‌భుత్వం ఆనాటి ఎన్నిక‌ల హామీల‌ను ఒక్కొక్క‌టీ అమ‌లు చేస్తూ ముందుకు సాగుతున్న‌ది. ఈ ద‌శ‌లోనే మెట్రో ప్రాజెక్టు నిర్మాణానికి ముందుకొచ్చింది. ఈ మేర‌కు ఆ రెండు న‌గ‌రాల్లో రెండు ద‌శ‌ల్లో ప్రాజెక్టుల నిర్మాణం చేప‌ట్టాల‌ని స‌ర్కారు నిర్ణ‌యించింది.

AP News: వైజాగ్ న‌గ‌రంలో మెట్రో ప్రాజెక్టులో భాగంగా ఫ‌స్ట్ ఫేజ్ కింద 46.23 కిలోమీట‌ర్ల మేర 3 కారిడార్ల నిర్మాణానికి నిర్ణ‌యించింది. మెట్రోలైన కారిడార్ -1 కింద విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వ‌ర‌కు 34.4 కిలోమీట‌ర్లు, కారిడార్ -2 కింద గురుద్వార్ నుంచి పాత పోస్టాఫీసు వ‌ర‌కు 5.08 కిలోమీట‌ర్లు, కారిడార్ -3 కింద తాటిచెట్ల‌పాలెం నుంచి చిన వాల్తేరు వ‌ర‌కు 6.75 కిలోమీట‌ర్ల లైన్ నిర్మాణం చేప‌ట్టాల‌ని ప్ర‌భుత్వం ప్రణాళిక రూపొందించింది. రెండో ద‌శ‌లో కారిడార్‌-4 కింద కొమ్మాది నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్ వ‌ర‌కు 30.67 కిలోమీట‌ర్ల వ‌ర‌కు మెట్రో లైన్ నిర్మాణం చేప‌ట్ట‌నున్న‌ది.

AP News: విజ‌య‌వాడ‌లో తొలి ద‌శ‌లో మెట్రోలైన్ కారిడార్ -1 కింద గ‌న్న‌వ‌రం నుంచి పండిట్ నెహ్రూ బ‌స్టాండ్ వ‌ర‌కు, కారిడార్ -2 కింద పండిట్ నెహ్రూ బ‌స్టాండ్ నుంచి పెన‌మ‌లూరు వ‌ర‌కు నిర్మాణం చేప‌ట్ట‌నున్నది. రెండో ద‌శ‌లో కారిడార్ -3 కింద పండిట్ నెహ్రూ బ‌స్టాండ్ నుంచి అమ‌రావ‌తి వ‌ర‌కు మెట్రో నిర్మాణానికి ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. దీంతో ఆయా న‌గ‌రాలు అభివృద్ధి చెంద‌డంతో పాటు ప్ర‌జార‌వాణా మెరుగ‌వుతుంది. అదే విధంగా ప‌ర్యాట‌కుల సంఖ్య పెరుగుతుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  TG SSC Exams Fee 2025: తెలంగాణ 10th Class పబ్లిక్‌ పరీక్షల ఫీజు షెడ్యూల్‌ విడుదల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *