Amaravati: రెడ్ అలర్ట్… మరో మూడు గంటల్లో పిడుగులు

Amaravati: ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాల్లో వర్షాలు, పిడుగులు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఎంపీ ప్రఖర్ జైన్ తెలిపారు ప్రకారం, రానున్న మూడు గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పిడుగులతో కురిసే అవకాశం ఉంది.

🔴 రెడ్ అలర్ట్: అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాలు.

🟠 ఆరెంజ్ అలర్ట్: ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాలు.

🟡 ఎల్లో అలర్ట్: బాపట్ల, ప్రకాశం జిల్లాలు.

ఈ జిల్లాల్లో వర్షాల సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. చెట్ల కింద, హోర్డింగుల దగ్గర నిలబడరాదని, వర్షాల సమయంలో సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని విజ్ఞప్తి చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *