Amit Shah

Amit Shah: ఉపరాష్ట్రపతి రాజీనామాపై అమిత్‌ షా క్లారిటీ

Amit Shah: భారత రాజకీయాల్లో ప్రస్తుతం పలు అంశాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఆకస్మిక రాజీనామా, అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న 130వ రాజ్యాంగ సవరణ బిల్లు దేశవ్యాప్తంగా రాజకీయ వేడిని పెంచాయి. ఈ రెండు కీలక అంశాలపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తాజాగా ప్రముఖ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ముఖ్యమైన విషయాలను వెల్లడించారు.

ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ రాజీనామాపై క్లారిటీ
ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ రాజీనామాపై వస్తున్న విమర్శలకు అమిత్‌ షా సమాధానం ఇచ్చారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. “మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ తన పదవీకాలంలో ఎన్నో మంచి పనులు చేశారు. ఆయన రాజీనామాకు వ్యక్తిగత అనారోగ్య సమస్యలే కారణం. దీనిని అనవసరంగా రాజకీయం చేయడం సరికాదు,” అని అమిత్‌ షా స్పష్టం చేశారు. అలాగే, కొత్త ఉపరాష్ట్రపతిని దక్షిణాది నుంచి ఎంచుకోవాలని భావించినట్లు కూడా ఆయన తెలిపారు. దీనికి తమిళనాడు ఎన్నికలతో ఎలాంటి సంబంధం లేదని ఆయన తేల్చి చెప్పారు.

130వ రాజ్యాంగ సవరణ బిల్లు: జైలు నుంచి పాలనకు చెక్
ఈ ఇంటర్వ్యూలో అమిత్‌ షా చేసిన అత్యంత కీలక వ్యాఖ్యలు 130వ రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించినవి. ఈ బిల్లు ఉద్దేశాన్ని వివరిస్తూ, “ప్రధానమంత్రి అయినా జైలు నుంచి పరిపాలన చేయడం మంచిదేనా? మన ప్రజాస్వామ్యానికి అది మర్యాదపూర్వకంగా ఉంటుందా?” అని అమిత్‌ షా ప్రశ్నించారు.

ఈ బిల్లు ప్రకారం, ఒక ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి లేదా ఏదేని ప్రజాప్రతినిధి ఏదైనా కేసులో అరెస్టయినట్లయితే, 30 రోజుల్లోగా బెయిల్ తెచ్చుకోవాలి. ఒకవేళ బెయిల్ లభించకపోతే, వారు తమ పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. రాజీనామా చేయకపోతే, చట్టమే వారిని పదవి నుంచి తొలగిస్తుంది.

Also Read: Warangal: వృద్ధ మహిళపై చేయిచేసుకున్న ఎస్ఐ శ్రీకాంత్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు

“ప్రధాని పదవికి కూడా ఈ నిబంధన వర్తిస్తుందని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే సూచించారు. అంటే, ఒకవేళ మోదీ గారు కూడా జైలుకెళ్తే ఆయన కూడా రాజీనామా చేయాల్సిందే. చట్టం అనేది ప్రభుత్వం, ప్రతిపక్షం అనే తేడా లేకుండా అందరికీ సమానంగా వర్తిస్తుంది,” అని అమిత్‌ షా వివరించారు.

ఈ బిల్లుపై ప్రతిపక్షాలు అనవసర ఆందోళనలు చేస్తున్నాయని, పార్లమెంటులో చర్చకు కూడా అవకాశం ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు. ఏదేమైనా, ఈ బిల్లు ఖచ్చితంగా పార్లమెంటులో ఆమోదం పొందుతుందని అమిత్‌ షా ధీమా వ్యక్తం చేశారు.

ALSO READ  HYDERABAD: ఉద్రిక్తతంగా.. అఘోరీతో కుటుంబ సభ్యుల ములాఖత్

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *