Amaravati: ఏపీలో ఉన్న పాకిస్తానీయులకు డీజీపీ హెచ్చరిక: 27వ తేదీ తర్వాత ఉంటే కఠిన చర్యలు

Amaravati: ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పాకిస్తానీయులపై రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 27వ తేదీ వరకు రాష్ట్రంలోని పాకిస్తానీయులు దేశాన్ని విడిచిపెట్టాలని ఆయన స్పష్టం చేశారు. 27వ తేదీ తర్వాత ఎవరైనా పాకిస్తానీయులు రాష్ట్రంలో ఉంటే, వారి మీద కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు.

ఈ మేరకు రాష్ట్రంలోని పోలీసు అధికారులకు పాకిస్తానీయులను గుర్తించి వెంటనే పంపించాల్సిందిగా డీజీపీ ఆదేశించారు. ఈ చర్యలు దేశ భద్రతను దృష్టిలో పెట్టుకుని తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు. అక్రమ వలసదారులపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని కూడా ఈ సందర్భంగా తెలియజేశారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *