Sivaji: నటుడు శివాజీ తాజాగా హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్పై చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘దండోరా’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో శివాజీ మాట్లాడుతూ.. “నటీమణుల అందం వారు వేసుకునే నిండైన దుస్తుల్లోనే ఉంటుంది” అని పేర్కొన్నారు. గ్లామర్ ఉండొచ్చు కానీ దానికి ఒక హద్దు ఉండాలని, హుందాగా కనిపిస్తేనే గౌరవం పెరుగుతుందని ఆయన హితవు పలికారు.
సినిమా రంగంలో గ్లామర్ అనేది ఒక భాగమే అయినప్పటికీ, అది హద్దులు దాటకూడదని నటుడు శివాజీ అభిప్రాయపడ్డారు. ‘దండోరా’ చిత్ర వేడుకలో ఆయన మాట్లాడుతూ.. ఫ్యాషన్ పేరుతో వింత దుస్తులు వేసుకుంటే బయటకు పొగిడినా, లోపల తిట్టుకునే అవకాశం ఉందని ఘాటుగా స్పందించారు. సావిత్రి, సౌందర్య వంటి లెజెండరీ నటీమణులను గుర్తు చేసుకుంటూ, ప్రస్తుత తరం హీరోయిన్లలో రష్మిక మందన్న డ్రెస్సింగ్ సెన్స్ను ఆయన మెచ్చుకోవడం విశేషం.
ఇది కూడా చదవండి: CM Chandrababu: టెక్ విద్యార్థులతో సీఎం చంద్రబాబు క్వాంటమ్ టాక్
ప్రపంచ వేదికలపై కూడా చీరకట్టులో ఉన్నవారికే విశ్వసుందరి కిరీటాలు వచ్చాయి” అని గుర్తు చేస్తూ హీరోయిన్లకు డ్రెస్సింగ్ విషయంలో శివాజీ కొన్ని సూచనలు చేశారు. నటీమణులు స్వేచ్ఛను గౌరవిస్తూనే, హుందాతనాన్ని కాపాడుకోవాలని కోరారు. తన రాబోయే చిత్రం ‘దండోరా’ (డిసెంబర్ 25 విడుదల) ప్రమోషన్లలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రష్మిక మందన్నను ఉదాహరణగా చూపిస్తూ గ్లామర్కు, గౌరవానికి ఉన్న వ్యత్యాసాన్ని వివరించారు.
