Rajendra Prasad: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ‘నటకిరీటి’గా సుస్థిర స్థానం సంపాదించుకున్నారు నటుడు రాజేంద్రప్రసాద్. ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ను అలరించిన హీరోగా, ప్రస్తుతం సహాయ నటుడిగా తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉన్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, గత కొంతకాలంగా ఆయన పబ్లిక్ ఈవెంట్లలో చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం తీవ్ర వివాదాస్పదంగా మారుతున్నాయి.
సినిమా ఫంక్షన్లలో ఆయన ప్రసంగించే తీరు, తోటి నటులపై చేసే కామెంట్స్… తరచుగా చర్చకు దారితీస్తున్నాయి. ఇటీవల జరిగిన సంఘటనలు ఈ అంశాన్ని మరింత బలం చేకూర్చాయి.
నోటి దురుసు.. వరుస అపవాదులు:
డేవిడ్ వార్నర్ కామెంట్స్: ‘రాబిన్ హుడ్’ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్లో రాజేంద్రప్రసాద్గారు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే సృష్టించాయి.
అలీపై ఘాటు వ్యాఖ్యలు: అంతకుముందు ఒక ఈవెంట్లో ప్రముఖ కమెడియన్ అలీని ఉద్దేశిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర విమర్శలకు గురయ్యాయి. ఆ తర్వాత తన మాటలపై వివరణ ఇచ్చి, ఇకపై జాగ్రత్తగా ఉంటానని హామీ కూడా ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Tollywood: రియాలిటీ కి వచ్చిన హీరోయిన్.. రెమ్యునరేషన్ తగ్గించుకున్న టాల్ బ్యూటీ
తాజా వివాదం – బ్రహ్మానందం గారిపై వ్యాఖ్యలు: తాజాగా ‘స:కుటుంబానాం’ సినిమా ఈవెంట్కు హాజరైన రాజేంద్రప్రసాద్గారు.. పద్మశ్రీ గ్రహీత, హాస్యబ్రహ్మ బ్రహ్మానందంగారు మాట్లాడిన తర్వాత మైక్ తీసుకుని మళ్లీ నోరు జారారు. “పద్మశ్రీ అవార్డు గ్రహీత బ్రహ్మానందం గారు మాట్లాడిన తర్వాత మేం మాట్లాడటం.. ఎంతైనా మీ శిష్యులమే కదా…” అంటూ మొదలుపెట్టిన ఆయన, ఆకస్మాత్తుగా… “నువ్వు ముసలి” అని వ్యాఖ్యానించారు. దీనికి బ్రహ్మానందం గారు “ఎవరు?” అని ప్రశ్నించగా, వెంటనే తప్పు తెలుసుకుని “నేనే” అంటూ కవర్ చేసేందుకు ప్రయత్నించారు.
సోషల్ మీడియాలో విమర్శల వెల్లువ:
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వరుసగా సినీ వేదికలపై రాజేంద్రప్రసాద్గారి ప్రవర్తన, మాట తీరు పట్ల నెటిజన్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. “ఆయన తీరులో ఎలాంటి మార్పు రావడం లేదు”, “ప్రతిసారి ఇలాగే ప్రవర్తిస్తున్నారు” అంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
ప్రజా జీవితంలో ఉన్న సీనియర్ నటుడిగా, ఆయన మాటలపై ఇంకాస్త సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ తాజా వివాదంపై నటకిరీటి ఎలా స్పందిస్తారో చూడాలి.
