Accident: ఛత్తీస్గఢ్లోని బలోద్ జిల్లాలో రాంగ్ సైడ్ నుంచి వస్తున్న ట్రక్కు కారును ఢీకొనడంతో ఆరుగురు మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారు. దొండి పోలీస్ స్టేషన్ పరిధిలోని భానుప్రతాపుర-దల్లిరాజర రహదారిపై చౌరపవాడ సమీపంలో తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది.
Accident: సమాచారం మేరకు ఎదురుగా వస్తున్న కారును లారీ ఢీకొట్టింది. క్షతగాత్రులను రాజ్నంద్గావ్ మెడికల్ కాలేజీకి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ASP) అశోక్ జోషి తెలియజేస్తూ, నిందితుడు ట్రక్ డ్రైవర్ సంఘటనా స్థలం నుండి పారిపోయాడని, అతని కోసం వెతుకుతున్నామనీ తెలిపారు.
ఇది కూడా చదవండి: Child Care: ఏడేళ్ల వయసులోనే పీరియడ్స్ రావచ్చు.. కారణాలివే.
Accident: ఈ ప్రమాదంలో కారు తీవ్రంగా దెబ్బతింది. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. స్థానికుల సాయంతో గంటల తరబడి శ్రమించి కారులో ఇరుక్కున్న వారిని బయటకు తీశారు.
Accident: సమాచారం ప్రకారం, కారులోని వ్యక్తులు దుండిలోని తమ బంధువుల ఇంట్లో ఒక కార్యక్రమంలో పాల్గొని స్వగ్రామం గురేడకు తిరిగి వస్తుండగా, దుండి పోలీస్ స్టేషన్ పరిధిలోని భాను ప్రతాపుర-దల్లి రాజహార ప్రధాన రహదారిపై చౌరపదవ్ సమీపంలో వారి కారును ట్రక్కు ఢీకొట్టింది. ఆ ప్రాంతంలో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.