Haryana

Haryana: గాఢ నిద్రలో ఉండగా పేలిన ఏసీ .. ముగ్గురు స్పాట్ డేడ్

Haryana: హరియాణాలో ఘోరం జరిగింది. ఫరీదాబాద్‌లో ఏసీలో మంటలు చెలరేగి, అది పేలిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు, వారి పెంపుడు కుక్క చనిపోయింది. ఈ సంఘటన ఫరీదాబాద్‌లోని గ్రీన్‌ఫీల్డ్ కాలనీలో చోటు చేసుకుంది. ఇంట్లో ఉన్న ఎయిర్ కండీషనర్ కంప్రెషర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో కుటుంబ సభ్యులు గాఢ నిద్రలో ఉన్నారు. ఈ దుర్ఘటనలో సచిన్ కపూర్ (49), అతని భార్య రింకూ కపూర్ (48), వారి కుమార్తె సుజ్జైన్ (13), వారి పెంపుడు కుక్క మరణించింది. పేలుడు తర్వాత ఇంట్లో పొగ దట్టంగా వ్యాపించడంతో వారు ఊపిరాడక చనిపోయారని పోలీసులు తెలిపారు.ఈ ప్రమాదంలో ఆర్యన్ కపూర్ (24), సచిన్, రింకూ దంపతుల కుమారుడు, బాల్కనీ నుంచి దూకి ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే, అతనికి కాళ్లు విరగడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల శరీరాలను పోస్ట్‌మార్టం కోసం పంపించారు. ప్రాథమిక నివేదికల ప్రకారం, ఊపిరాడక చనిపోయారని భావిస్తున్నారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Bandi sanjay: రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇచ్చామో చర్చకు రెడీ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *