Madhusudan: 25 కోట్లు కేటాయించాలని అడగడంలో ఎలాంటి తప్పు లేదు

Madhusudan: పాలమూరు జిల్లాకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే టీఆర్‌ఎస్ నేత అనిరుధ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను తాను పూర్తిగా సమర్థిస్తున్నానని ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి తెలిపారు.

“ప్రతి నియోజకవర్గానికి రూ.25 కోట్లు కేటాయించాలని అడగడంలో ఎలాంటి తప్పు లేదు. గత పదేళ్లుగా పాలమూరు జిల్లా అభివృద్ధి పరంగా తీవ్రంగా నిర్లక్ష్యానికి గురైంది. ప్రజల అభ్యున్నతి, ప్రాంత అభివృద్ధి కోసమే అనిరుధ్ ఆ డిమాండ్ చేశారు,” అని ఆయన అన్నారు.

అలాగే ఇటీవల రైతు పండుగ వేదికగా ముఖ్యమంత్రి పాలమూరు జిల్లాకు సంవత్సరానికి రూ.20 వేల కోట్ల నిధులు ఇస్తామని ప్రకటించిన విషయాన్ని గుర్తుచేస్తూ, “అదే ఉద్దేశ్యంతో అనిరుధ్‌రెడ్డి ఆ విషయాన్ని ప్రస్తావించారు” అని మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు.

అభివృద్ధి, నిధుల కేటాయింపులో పాలమూరు జిల్లాకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *