Aarogyasri: ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ సేవలు నేటి (సోమవారం, సెప్టెంబర్ 15, 2025) నుంచి నిలిచిపోయాయి. రాష్ట్రంలోని నెట్వర్క్ ఆసుపత్రులు ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశాయి. ప్రభుత్వం తమకు చెల్లించాల్సిన రూ. 2 వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ సేవలు నిలిపివేయడం వల్ల వేలాది మంది పేద రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పెరిగిన పెండింగ్ బిల్లులు, నిలిచిపోయిన సేవలు
నెట్వర్క్ ఆసుపత్రులు ప్రభుత్వం నుంచి చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఆరోగ్యశ్రీ బిల్లుల కోసం ఎదురు చూస్తున్నాయి. ఈ బకాయిలు ఇప్పుడు రూ. 2 వేల కోట్లకు చేరడంతో, ఆసుపత్రుల నిర్వహణకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితిలో ఆరోగ్యశ్రీ పథకం కింద సేవలు కొనసాగించడం తమకు సాధ్యం కాదని ఆసుపత్రుల ప్రతినిధులు తెలిపారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ‘ఆశా’ ప్రతినిధులు ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ సమస్యను వారం రోజుల్లోగా పరిష్కరించాలని వారు కోరారు.