Hyderabad

Hyderabad: హైదరాబాద్‌లో విషాదం.. ఇండిగో క్యాబిన్ క్రూ యువతి ఆత్మహత్య.. కారణం ఏంటంటే..!

Hyderabad: భాగ్యనగరంలో ఒక విషాదకర ఘటన జరిగింది. ఇక్కడ ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో క్యాబిన్ క్రూగా పనిచేస్తున్న ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

మరణించిన యువతిని పోలీసులు జాహ్నవి గుప్తాగా గుర్తించారు. ఆమె జమ్మూకు చెందినదని తెలిసింది.

పార్టీ చేసుకున్న తర్వాతే…
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం… జాహ్నవి గుప్తా, ఇండిగో కెప్టెన్‌తో పాటు మరో స్నేహితురాలితో కలిసి పార్టీ చేసుకుంది. పార్టీ అయిన తర్వాత జాహ్నవి తన గదికి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న ఆమె సహచరులు, స్నేహితులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

కుటుంబ సభ్యులు ఏం చెప్పారు?
సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. వారు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు.

పోలీసుల ప్రాథమిక విచారణలో, జాహ్నవి కుటుంబ సభ్యులు కీలక విషయాన్ని తెలిపారు. జాహ్నవి కొంతకాలంగా డిప్రెషన్ తో బాధపడుతోందని వారు చెప్పారు.

వ్యక్తిగత సమస్యల కారణంగానే ఆమె ఈ తీవ్ర నిర్ణయం తీసుకుని ఉండవచ్చని పోలీసులు మొదట భావిస్తున్నారు. ఈ ఘటనతో ఇండిగో సిబ్బంది మరియు జాహ్నవి స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *