Kishan Reddy

Kishan Reddy: తెలంగాణ ‘హిల్ట్’ పాలసీపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఫైర్!

Kishan Reddy: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్’ (HILT) పాలసీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ విధానాన్ని తీసుకురావడానికి ముందు ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయలేదని, ప్రజలు, పరిశ్రమల వద్ద పనిచేసే వారితో చర్చించలేదని ఆయన అన్నారు.

ఈ కొత్త పాలసీ ద్వారా పారిశ్రామిక వాడలలో ఉన్న వేల ఎకరాల స్థలాన్ని కమర్షియల్ కాంప్లెక్స్‌లుగా మార్చుకోవడానికి అనుమతి ఇస్తే, ట్రాఫిక్ సమస్య మరింత పెరిగిపోతుందని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ నిర్ణయం వలన హైదరాబాద్ నగరంలో రద్దీ ఇంకా ఎక్కువ అవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

అంతేకాక, ఈ హిల్ట్ పాలసీ అనేది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మరియు పారిశ్రామికవేత్తలకు మాత్రమే లాభం చేకూర్చేలా ఉందని, ఇందులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం ఒకవైపు రైతులకు సహకారం అందించకుండా, కేవలం పారిశ్రామికవేత్తలకు మాత్రమే లాభం కలిగేలా ఒక ప్రత్యేక విధానాన్ని తీసుకురావడం సరికాదని కిషన్‌రెడ్డి నిలదీశారు. “పారిశ్రామిక వేత్తలకు ఒక విధానం, రైతులకు ఒక విధానమా?” అని ఆయన తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ విధానం వెనుక ఉన్న లబ్ధిదారుల గురించి ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *