Pawan Kalyan: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈరోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన సందడి చేయనుంది. రోజు మొత్తం పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననుండటంతో జిల్లా ప్రజల్లో ఆసక్తి పెరిగింది. ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరిన పవన్, రాజమండ్రి ఎయిర్పోర్టుకు చేరుకున్న వెంటనే హెలికాప్టర్ ద్వారా మలికిపురం మండలంలోని గూడపల్లి హెలీప్యాడ్కు చేరుకున్నారు.
అక్కడి నుంచి కేశనపల్లి గ్రామానికి చేరుకున్న పవన్ కళ్యాణ్, సముద్ర జలాల పోటుతో నాశనం అయిన విస్తారమైన కొబ్బరి తోటలను ప్రత్యక్షంగా పరిశీలించారు. లక్షలాది కొబ్బరి చెట్లు వాడిపోవడంతో తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్న రైతులతో ఆయన మాట్లాడి వారి సమస్యలను విన్నారు. రైతుల కష్టాలను తగ్గించేందుకు ప్రభుత్వం తీసుకునే చర్యలపై వారికి భరోసా ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: AP Mock Assembly: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అమరావతిలో విద్యార్థుల మాక్ అసెంబ్లీ సందడి
కేశనపల్లి సందర్శన అనంతరం పవన్ రోడ్డు మార్గాన రాజోలు మండలంలోని శివకోటికి వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను పరిశీలించి, పల్లె పండగ 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామాభివృద్ధికి సంబంధించిన పలు పనులకు భూమిపూజ కూడా చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో స్థానిక ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు.
పర్యటన ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్ శివకోటిలోని హెలీప్యాడ్ నుంచి హెలికాప్టర్లో రాజమండ్రికి చేరుకుని, అక్కడి నుండి హైదరాబాద్కు తిరిగి వెళ్లనున్నారు. కోనసీమలో పవన్ పర్యటన కారణంగా అభిమానులు, స్థానిక ప్రజల్లో ఉత్సాహం కనిపించింది.

