DMK Leader

DMK Leader: డీఎంకే నాయకుడిపై అత్యాచారం, బ్లాక్‌మెయిల్ కేసు నమోదు

DMK Leader: తమిళనాడులో డీఎంకే పార్టీకి చెందిన కార్యకర్త భాస్కరన్‌పై 25 ఏళ్ల మహిళ లైంగిక వేధింపులు, బ్లాక్‌మెయిల్ ఆరోపణలతో ఫిర్యాదు చేయగా, పోలీసులు ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేశారు. కోటకప్పుంలోని ఆల్-విమెన్ పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేయగా, భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 64 (అత్యాచారానికి శిక్ష) కింద కేసు నమోదు చేశారు. బాధితురాలు విజయలక్ష్మి, తన భర్త సెంథిల్ కుమార్ వేరుగా ఉన్నందున, ఆమె తన కుమారుడు చంద్రు, తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. ఆమె పొదుపు చేసిన డబ్బుతో ఇల్లు కట్టుకుంటుండగా, పక్కింటివాడైన డీఎంకే నేత భాస్కరన్ నిర్మాణ సామాగ్రిని ఏర్పాటు చేస్తానని చెప్పి ఆమె నుంచి డబ్బులు వసూలు చేశాడు.

ఆ తర్వాత, భాస్కరన్ పదేపదే ఫోన్లు చేయడం మొదలుపెట్టాడు. ఆమె ప్రశ్నించగా, తానూ ఒంటరిగా ఉన్నానని, తాము కలిసి ఉండవచ్చని ప్రతిపాదించాడు. ఆమె తిరస్కరించడంతో, పరువు తీస్తానని, పోలీసులకు వెళ్లవద్దని బెదిరించాడు. ఒక రాత్రి, భాస్కరన్ ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, లైంగికంగా దాడి చేశాడు. ఆమె ప్రతిఘటించగా, బలవంతంగా దుస్తులు తొలగించి, ఆ దాడిని వీడియో రికార్డు చేశాడు. అప్పటి నుంచి, రికార్డు చేసిన ఆ వీడియోను చూపి బ్లాక్‌మెయిల్ చేస్తూ, ప్రతిఘటించినప్పుడల్లా చంపుతానని బెదిరింపులకు పాల్పడ్డాడని ఎఫ్‌ఐఆర్‌లో విజయలక్ష్మి ఆరోపించింది. ఏఐఏడీఎంకే నాయకుడు ఎడప్పాడి పళనిస్వామి ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు.

ప్రస్తుత ప్రభుత్వంలో తమిళనాడులో మహిళలకు రక్షణ లేదని ఆరోపించారు. రాజకీయ పలుకుబడిని ఉపయోగించి నిందితుడు మహిళను బెదిరించాడని ఆరోపిస్తూ, భాస్కరన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై కూడా స్పందించారు. డీఎంకే రక్షణలో అధికార పార్టీ కార్యకర్తలు ‘ఎక్స్‌ప్లాయిట్ చేయడానికి లైసెన్స్‌తో స్వేచ్ఛగా తిరుగుతున్నారు’ అని ఆరోపించారు. ధైర్యంగా ఫిర్యాదు చేసిన బాధితురాలిని ప్రశంసించారు. మహిళల భద్రతకు ప్రాధాన్యతనిచ్చే ప్రభుత్వం రాష్ట్రానికి కావాలని డిమాండ్ చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *