Cm chandrababu: రోడ్డుపై గుంత ఉండొద్దు.. అధికారులకు సీఎం హెచ్చరిక

Cm chandrababu: రాష్ట్ర రహదారుల అభివృద్ధి పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్‌ ద్వారా కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్&బీ శాఖ మంత్రి బీసీ జనార్ధన్‌ రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సమీక్షలో సీఎం మాట్లాడుతూ, వచ్చే డిసెంబర్ నాటికి రాష్ట్రంలో ఎక్కడా గుంతలు లేకుండా రహదారులు పాత్‌హోల్ ఫ్రీగా ఉండాలనే లక్ష్యంతో అధికారులు కృషి చేయాలి అని స్పష్టం చేశారు. రహదారి మరమ్మత్తుల విషయంలో ఎలాంటి రాజీ పడకుండా, క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని మంత్రికి, సంబంధిత అధికారులకు సూచించారు.

గత ఏడాది చేపట్టిన మిషన్ పాత్‌హోల్ ఫ్రీ కార్యక్రమం ద్వారా రూ. 861 కోట్లతో రహదారి మరమ్మత్తులు పూర్తిచేశామని సీఎం తెలిపారు. అలాగే, ఈ ఏడాది రహదారి అభివృద్ధి కోసం రూ. 2,500 కోట్ల పనులకు పరిపాలనా అనుమతులు ఇచ్చినట్లు వెల్లడించారు.

అదనంగా, రూ. 400 కోట్ల నాబార్డ్ నిధులతో 1,250 కిలోమీటర్ల జిల్లా ప్రధాన రహదారులకు సంబంధించిన 191 పనులు త్వరలో చేపట్టనున్నట్లు తెలిపారు. అలాగే రూ. 600 కోట్ల మూలధన వ్యయం కింద 227 పనులు ఆమోదం పొందాయని చెప్పారు. మొత్తంగా 1,450 కిలోమీటర్ల రహదారి మెరుగుదలకు గుత్తేదారులకు పనులు అప్పగించినట్లు వివరించారు.

కూడా, కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒక ఏడాది లోపే రూ. 2,500 కోట్లతో 5,471 కిలోమీటర్ల రహదారుల అభివృద్ధి పనులకు అనుమతులు ఇవ్వడం ఒక చారిత్రాత్మక మైలురాయి అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

ఇటీవల మోంథా తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న 4,794 కిలోమీటర్ల రహదారులను అత్యవసరంగా మరమ్మత్తు చేయాలని ఆయన ఆదేశించారు.

పెండింగ్ బిల్లుల విషయంలో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు రహదారి పనులకు రూ. 4,000 కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నాయని, అందులో ఇప్పటివరకు రూ. 1,900 కోట్లు క్లియర్ చేశామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *