Digital Gold: భారతదేశంలో బంగారంపై ఉన్న చిన్న నుండి పెద్దలవరకు ప్రేమ ఉంటది దానికి ఆధునిక ఫిన్టెక్ రూపంగా వచ్చిన ‘డిజిటల్ గోల్డ్’ (Digital Gold) నవతరం పెట్టుబడిదారులలో భారీ విజయాన్ని సాధించింది. కేవలం రూ. 100తో యాప్ల ద్వారా బంగారం కొనుగోలు చేసే వెసులుబాటు బాగా ప్రాచుర్యం పొందింది. అయితే, ఇప్పుడు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) ఈ ‘మెరిసే’ సౌకర్యంపై తీవ్ర హెచ్చరిక జారీ చేసింది.
గత వారం, ఆన్లైన్ ప్లాట్ఫారమ్లు అందించే డిజిటల్ గోల్డ్ లేదా ఇ-గోల్డ్ ఉత్పత్తులను కొనుగోలు చేయకుండా పెట్టుబడిదారులను హెచ్చరిస్తూ సెబీ ఒక బహిరంగ నోటీసును జారీ చేసింది.
సెబీ హెచ్చరికకు కారణం ఇదే
సెబీ హెచ్చరిక వెనుక ఉన్న ప్రధాన సమస్య ఆ ఉత్పత్తుల నియంత్రణ లేమి (Regulatory Vacuum). డిజిటల్ గోల్డ్ ఉత్పత్తులు సెక్యూరిటీలుగా గానీ, లేదా కమోడిటీ డెరివేటివ్లుగా గానీ వర్గీకరించబడలేదు. అందువల్ల, ఇవి పూర్తిగా సెబీ అధికార పరిధికి వెలుపల పనిచేస్తున్నాయి.సరళంగా చెప్పాలంటే, రేపు ఒక డిజిటల్ గోల్డ్ ప్లాట్ఫామ్ కూలిపోతే లేదా దివాలా తీస్తే, మీ డబ్బు పోవచ్చు. సెబీ పెట్టుబడిదారుల భద్రతా చట్రం కింద మీకు ఎటువంటి చట్టపరమైన రక్షణ ఉండదు.
ఇది కూడా చదవండి: Kranti Gaud: క్రాంతి గౌడ్ వరల్డ్ కప్ మ్యాజిక్.. తండ్రికి పోయిన ఉద్యోగం వచ్చింది!
మీరు యాప్ ద్వారా కొనుగోలు చేసిన బంగారానికి సమానమైన భౌతిక బంగారం ఖజానాలో ఉందని ప్లాట్ఫామ్ చెబుతుంది. అయితే, ఆ బంగారాన్ని ఎవరు తనిఖీ చేస్తారు, ఆడిట్ చేస్తారు లేదా హామీ ఇస్తారు అనే దానిపై ఏకరీతి నియమాలు లేవు. ప్లాట్ఫామ్ దివాలా తీస్తే ఏమి జరుగుతుందో నిర్వచించే స్పష్టమైన చట్రం కూడా లేదు. నియంత్రణ పర్యవేక్షణ లేకపోవడం వల్ల, ఏ ప్లాట్ఫామ్ సురక్షితమైనదో తెలుసుకోవడం కష్టమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నియంత్రిత ప్రత్యామ్నాయాలు ఏమిటి?
బంగారం కొనకండి అని సెబీ చెప్పడం లేదు, కానీ ప్రమాదాలు తెలియకుండా నియంత్రణ లేని బంగారాన్ని కొనొద్దని చెబుతోంది. అందుకే, పెట్టుబడిదారులు నియంత్రణ ఉన్న ఉత్పత్తులను ఎంచుకోవాలని సెబీ సూచిస్తోంది.
ఇవి స్టాక్ ఎక్స్ఛేంజీలలో వర్తకం చేసే మ్యూచువల్ ఫండ్ పథకాలు. ప్రతి యూనిట్ ఒక నిర్దిష్ట పరిమాణంలో బంగారాన్ని సూచిస్తుంది. బంగారాన్ని అధీకృత కస్టోడియన్ పర్యవేక్షిస్తారు.ఎలక్ట్రానిక్ గోల్డ్ రసీదులు (EGRలు) ఇవి కూడా సెబీ నియంత్రిత ఉత్పత్తులే. ఈ నియంత్రిత ఉత్పత్తులు పెట్టుబడిదారులకు పారదర్శకత, రక్షణ యంత్రాంగాలు మరియు చట్టపరమైన ఆసరా అందిస్తాయి.
ఇది కూడా చదవండి: Cold Weather: తెలంగాణలో భారీగా పెరిగిన చలి.. వారం రోజుల పాటు ఈ జిల్లాల వాళ్లు జాగ్రత్త
పెట్టుబడిదారులు చేయవలసినది
సెబీ హెచ్చరికను సీరియస్గా తీసుకోవాలని ఆర్థిక సలహాదారులు సూచిస్తున్నారు. పెట్టుబడిదారులు తమ డిజిటల్ గోల్డ్ హోల్డింగ్లను గోల్డ్ ఈటీఎఫ్లు లేదా ఈజీఆర్ల వంటి నియంత్రిత బంగారు ఉత్పత్తులకు తరలించాలని అభిషేక్ కుమార్ (సహజ్మనీ వ్యవస్థాపకుడు) వంటి నిపుణులు సలహా ఇస్తున్నారు.
చివరి మాట: డిజిటల్ గోల్డ్ సౌలభ్యం అందించినా, నియంత్రణ లేకపోవడం వల్ల మీరు భద్రతా వలయాన్ని కోల్పోతారు. “ఇది నియంత్రించబడకపోతే, అది ప్రమాదకరం” అనే సెబీ సందేశం ఈ విషయంలో స్పష్టం చేస్తోంది.
