Chevella Accident

Chevella Accident: చేవెళ్ల బస్సు ప్రమాదం: కంటతడి పెట్టిస్తున్న తల్లీబిడ్డ మరణం

Chevella Accident: రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల మండల పరిధిలోని హైదరాబాద్‌-బీజాపూర్‌ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం యావత్ రాష్ట్రాన్ని కన్నీటిపర్యంతం చేసింది. సోమవారం తెల్లవారుజామున అతి వేగంతో దూసుకొచ్చిన టిప్పర్ లారీ, ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొట్టడంతో ఈ పెను విషాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో మొత్తం 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 10 మంది పురుషులు, 9 మంది మహిళలు, ఒక మూడు నెలల చిన్నారి ఉన్నారు.

ఈ ప్రమాదంలో అత్యంత హృదయ విదారక దృశ్యం తల్లీబిడ్డల మృతి. తల్లి పొత్తిళ్లలో వెచ్చగా పడుకున్న మూడు నెలల చిన్నారి, ప్రమాద ధాటికి తల్లి చేతుల్లోనే ప్రాణాలు వదిలింది. రోడ్డుపై పక్కపక్కనే విగత జీవులుగా పడి ఉన్న ఆ తల్లీబిడ్డల దృశ్యం ప్రతి ఒక్కరి హృదయాన్ని కలిచివేసి, కంటతడి పెట్టిస్తుంది.

Also Read: Chevella Road Accident: చేవెళ్ల రోడ్డు ప్రమాదం.. మృతులు, క్షతగాత్రుల వివరాలివే!

ప్రమాద వివరాలు : 
షాద్‌నగర్ వైపు నుంచి కంకర లోడుతో వస్తున్న టిప్పర్ లారీ అదుపుతప్పి, తాండూర్ నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సును మీర్జాగూడ దగ్గర టర్నింగ్ పాయింట్‌లో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. టిప్పర్ ఓవర్ స్పీడ్ వల్లే ఈ ఘోరం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.

ఈ ప్రమాదంలో 40 మంది గాయపడ్డారు, వీరిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సంఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ బృందాలు, బస్సులోని కంకరలో కూరుకుపోయిన వారిని బయటకు తీసి, హుటాహుటిన చేవెళ్ల, వికారాబాద్ ఆస్పత్రులకు తరలించి వైద్యం అందిస్తున్నారు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *