Exit Polls

Exit Polls: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం

Exit Polls: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రకటించకుండా నిషేధం విధించారు. ఈ విషయాన్ని జిల్లా ఎన్నికల అధికారి ఆర్.వి. కర్ణన్ గారు తెలిపారు.

నిబంధనలు ఏమిటి?
నవంబర్ 6 ఉదయం 7 గంటల నుండి నవంబర్ 11 సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్‌కు సంబంధించిన ఏ సమాచారాన్ని, సర్వేలను, లేదా ఫలితాలను ఎక్కడా ప్రచురించకూడదు.

న్యూస్ ఛానెళ్లు, రేడియో, పేపర్లు, సోషల్ మీడియా, ఇతర డిజిటల్ మాధ్యమాలన్నింటిలో ఈ నిషేధం కచ్చితంగా అమలులో ఉంటుంది.

ఉల్లంఘిస్తే శిక్ష తప్పదు!
ఈ ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే, ప్రజాప్రతినిధుల చట్టం, 1951 ప్రకారం శిక్ష పడుతుంది. వారికి రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష, లేదా జరిమానా, లేదా రెండూ విధించే అవకాశం ఉంటుంది.

అలాగే, పోలింగ్ జరగడానికి 48 గంటల ముందు నుంచి కూడా ఎన్నికల గురించిన సర్వేలు, అభిప్రాయ సేకరణ ఫలితాలను ఎలక్ట్రానిక్ లేదా ఇతర మాధ్యమాల్లో చూపించకూడదని అధికారులు స్పష్టం చేశారు.

మీడియా సంస్థలు, రాజకీయ పార్టీలు, సోషల్ మీడియా వాడేవారు, ఎన్నికలకు సంబంధించిన అందరూ ఈ నియమాలను కచ్చితంగా పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి ఆర్.వి. కర్ణన్ గారు సూచించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *