Uttam Kumar: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు లైన్ క్లియర్ – ఛత్తీస్‌గఢ్ సీఎం గ్రీన్ సిగ్నల్

Uttam Kumar: ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయితో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. సోమవారం రాయ్‌పూర్‌లో జరిగిన ఈ సమావేశంలో గోదావరిపై తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు నిరభ్యంతర పత్రం (NOC) జారీపై చర్చించారు.

ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ అంగీకారం

మంత్రి ఉత్తమ్ విజ్ఞప్తికి ఛత్తీస్‌గఢ్ సీఎం సానుకూలంగా స్పందించారు. ఎన్‌వోసీ ఇవ్వడానికి అంగీకరించారు. దీంతో ములుగు జిల్లాలో నిర్మాణం జరగబోయే సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు లైన్ క్లియర్ అయినట్లైంది.

ప్రాజెక్టు వివరాలు

నీటి నిల్వ సామర్థ్యం: 6.7 టీఎంసీలు

ప్రదేశం: ములుగు జిల్లా

ప్రధాన ఉద్దేశ్యం: సాగునీటి అవసరాలు తీర్చడం, గోదావరి జలాల వినియోగం

ముంపు సమస్య పరిష్కారం

ఈ ప్రాజెక్టు వల్ల ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని గ్రామాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని గుర్తించారు. దీనికి పరిహారంగా నష్టపరిహారం భరించేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. ఈ ఒప్పందంతో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలకు పరిష్కారం లభించింది.

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *