Amravati: ఏపీలో మూడు గంటలు కీలకం – పిడుగులతో భారీ వర్షాలకు రెడ్ అలెర్ట్

Amaravati: ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే మూడు గంటలపాటు వాతావరణం అత్యంత కీలకంగా మారనుంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరికలు జారీ చేసింది.

రెడ్ అలెర్ట్ జిల్లాలు

కాకినాడ, అనకాపల్లి, పల్నాడు (వినుకొండ) జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే ప్రమాదం ఉన్నందున అధికారులు ‘రెడ్ అలెర్ట్’ ప్రకటించారు.

ఆరెంజ్ అలెర్ట్ జిల్లాలు

శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, ప్రకాశం జిల్లాల్లో పిడుగులతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ‘ఆరెంజ్ అలెర్ట్’ ప్రకటించారు.

యెల్లో అలెర్ట్ జిల్లాలు

ఎన్టీఆర్ జిల్లా, ఉత్తరాంధ్ర, రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ‘యెల్లో అలెర్ట్’ ప్రకటించారు.

అధికారుల హెచ్చరికలు

వర్షాల సమయంలో బలమైన ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని అధికారులు సూచించారు.చెట్ల కింద, భారీ హోర్డింగుల దగ్గర, శిథిల భవనాల వద్ద నిలవవద్దు.పిడుగులు పడే సమయంలో బయట తిరగకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి.

రైతులు, కూలీలు జాగ్రత్తలు తీసుకోవాలి.

ప్రజల ప్రాణభద్రత కోసం వాతావరణం సాధారణ స్థితికి వచ్చే వరకు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *