Smriti Mandhana

Smriti Mandhana: స్మృతి మంధాన రికార్డుల మోత

Smriti Mandhana: భారత మహిళ క్రికెటర్ స్మృతి మంధాన ఒక అద్భుతమైన ఫామ్‌లో ఉంది. ఆమె ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో సెంచరీ సాధించి రికార్డులు సృష్టించింది. ఆ మ్యాచ్‌లో ఆమె 91 బంతుల్లో 117 పరుగులు చేసింది, ఇందులో 14 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి.భారత మహిళా క్రికెటర్లలో ఇది రెండో వేగవంతమైన వన్డే సెంచరీ. ఆమె 77 బంతుల్లోనే శతకం పూర్తి చేసింది. మొదటి స్థానంలో కూడా ఆమెనే ఉంది (ఐర్లాండ్‌పై 70 బంతుల్లో సెంచరీ). వన్డే క్రికెట్‌లో ఓపెనర్‌గా అత్యధిక సెంచరీలు (12) చేసిన మహిళా క్రికెటర్ల ప్రపంచ రికార్డును స్మృతి మంధాన సమం చేసింది. ఈ జాబితాలో ఆమె న్యూజిలాండ్ క్రీడాకారిణి సుజీ బేట్స్, ఇంగ్లాండ్ క్రీడాకారిణి టామ్మీ బ్యూమాంట్‌తో కలిసి మొదటి స్థానంలో ఉంది.

ఇది కూడా చదవండి: Pennsylvania Police Shooting: పెన్సిల్వేనియాలో కాల్పుల కలకలం.. ముగ్గురు పోలీసులు మృతి, ఇద్దరికి గాయాలు

ఒకే క్యాలెండర్ సంవత్సరంలో మూడు లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు సాధించిన తొలి మహిళా క్రికెటర్‌గా నిలిచింది. ఆమె 2017లో 787 పరుగులు చేసింది. అలాగే ఆసీస్‌ జట్టు మీద అత్యధిక సెంచరీలు (3) చేసిన ఆసియా బ్యాటర్‌గా నిలిచింది.ఆస్ట్రేలియాపై అత్యంత వేగంగా సెంచరీ చేసిన మహిళా బ్యాటర్‌గా ఆమె రికార్డు సృష్టించింది. అంతకు ముందు ఈ రికార్డు ఇంగ్లాండ్ క్రీడాకారిణి నాట్ స్కైవర్ బ్రంట్ పేరు మీద ఉండేది. ఆమె అద్భుతమైన ప్రదర్శనతో భారత్ జట్టు ఆస్ట్రేలియాను ఓడించి, సిరీస్‌ను 1-1తో సమం చేసింది.రన్స్ పరంగా ఆసీస్‌‌‌‌కు ఇది అతి పెద్ద ఓటమి కావడం విశేషం. వన్డేల్లో ఆస్ట్రేలియాపై స్వదేశంలో 18 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఇండియాకు ఇదే తొలి విజయం. చివరగా 2007లో చెన్నైలో ఆసీస్‌‌‌‌ను ఓడించింది. తాజా విక్టరీతో వరుసగా 13 వన్డేల్లో ఓటమి ఎరుగని ఆసీస్‌‌‌‌ జైత్రయాత్రకు బ్రేక్‌‌‌‌ వేసింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *