DGP Jitendar: ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది

DGP jitendar: ప్రఖ్యాత ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జన ప్రక్రియ ఈరోజు ప్రశాంతంగా ముగిసిందని తెలంగాణ డీజీపీ జితేందర్ ప్రకటించారు. భాగ్యనగరంలో వినాయక నిమజ్జనాలు ఎటువంటి అవాంతరాలు లేకుండా కొనసాగుతున్నాయని ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత వాతావరణం

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వినాయక నిమజ్జనాలు సజావుగా కొనసాగుతున్నాయని డీజీపీ వెల్లడించారు. నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో ప్రత్యేక బలగాలు విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

బాలాపూర్ గణపతి శోభాయాత్ర

బాలాపూర్ గణపతి శోభాయాత్ర విజయవంతంగా ప్రారంభమైందని, నాలుగు గంటల్లో నిమజ్జనం పూర్తి అవుతుందని జితేందర్ చెప్పారు.

రేపటివరకు నిమజ్జనాలు

నిమజ్జనాలు రేపటి వరకు కొనసాగుతాయని డీజపీ స్పష్టం చేశారు. బంజారాహిల్స్‌లోని ఐసీసీ కంట్రోల్ రూమ్ నుంచి మొత్తం నిమజ్జన ప్రక్రియను పర్యవేక్షిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

ఎస్డీఆర్ఎఫ్ పాల్గొనడం

ఈసారి వినాయక నిమజ్జన విధుల్లో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా పాల్గొన్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *