Hyderabad: పట్నంలో 12 వేల కోట్ల విలువగల డ్రగ్స్ స్వాధీనం

Hyderabad: హైదరాబాద్ నగరాన్ని కుదిపేస్తూ మరోసారి భారీ డ్రగ్స్ వ్యవహారం బయటపడింది. మేడ్చల్‌ను కేంద్రంగా చేసుకుని డ్రగ్స్ తయారీ చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఆపరేషన్‌లో సుమారు రూ.12 వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల దర్యాప్తులో మేడ్చల్ ప్రాంతంలో గోప్యంగా డ్రగ్స్ ఫ్యాక్టరీ నడుపుతున్నట్టు తేలింది. ఆధునిక పద్ధతుల్లో పెద్దఎత్తున నిషేధిత మాదక ద్రవ్యాలను తయారు చేసి దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు విదేశాలకు కూడా సరఫరా చేస్తున్నట్టు సమాచారం.

ఈ కేసులో కీలక వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు, నెట్వర్క్‌ వెనుక ఉన్న ముఠా అంతర్జాతీయ స్థాయిలో పనిచేస్తోందని అనుమానిస్తున్నారు. హైదరాబాద్, తెలంగాణలో మాదక ద్రవ్యాల సరఫరా అడ్డుకోవడంలో ఇది పెద్ద విజయమని అధికారులు తెలిపారు.

డ్రగ్స్ రాకపోకలను అడ్డుకోవడమే కాకుండా, ఈ రాకెట్‌ వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులను కూడా పట్టుకోవడమే లక్ష్యంగా ప్రత్యేక బృందాలు కృషి చేస్తున్నాయి.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *