Delhi: ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఖరారు..?

Delhi: బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర బోర్డు సభ్యులు హాజరయ్యారు.

ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఖరారు

ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేసే దిశగా చర్చలు జరిగాయి. రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ పేరుపై పార్లమెంటులో విస్తృత స్థాయిలో ఏకాభిప్రాయం నెలకొన్నప్పటికీ, ఆయన స్వయంగా బీజేపీ అగ్రనాయకత్వం ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు.

హరివంశ్ నారాయణ్ సింగ్ పరిశీలనలో

ఈ నేపథ్యంలో రాజ్యసభ ఉపాధ్యక్షుడు హరివంశ్ నారాయణ్ సింగ్ పేరును కూడా బీజేపీ పరిశీలిస్తోంది. ఆయన బీహార్‌లో అధికారంలో ఉన్న జేడీయూ సీనియర్ నేతగా, ఎన్డీఏ భాగస్వామ్య పక్షానికి చెందినవారు కావడం విశేషం.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Horoscope Today: పాత సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి.. అంచనాలు నెరవేరతాయి 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *