LIC

LIC: 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎల్‌.ఐ‌.సి. సేవా, సమాజాభివృద్ధి పట్ల నిబద్ధతను పునరుద్ఘాటించింది

LIC: దేశవ్యాప్తంగా 79వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు ఉత్సాహంగా జరుగుతున్న వేళ, ఎల్‌.ఐ‌.సి. ఆఫ్ ఇండియా సౌత్ సెంట్రల్ జోన్ కార్యాలయం ప్రాంగణంలో జోన్ మేనేజర్ శ్రీ పుణీత్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వాతంత్ర్య దినోత్సవం మన దేశాన్ని ప్రత్యేకంగా నిలిపే విలువలను గుర్తు చేసుకునే సమయమని పేర్కొన్నారు.

ఎల్‌.ఐ‌.సి. ఉద్యోగులు నిజాయితీతో తమ కర్తవ్యాలను నిర్వర్తించడం దేశసేవలో భాగమని ఆయన  చెప్పారు. వినియోగదారులకు ఆర్థిక, సామాజిక భద్రత అందించడం ఒక గౌరవమైన బాధ్యత అని, వారి అవసరాలకు అనుగుణంగా కొత్త బీమా, పెట్టుబడి ఉత్పత్తులను అభివృద్ధి చేయడంలో ఎల్‌.ఐ‌.సి. నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.

LIC

ఆయన మూడు ముఖ్యమైన సూత్రాలను ప్రతిపాదించారు “నా దేశం ముందు, నా భూమి ముందు, నా ఎల్‌.ఐ‌.సి. ముందు”. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని, పచ్చని భవిష్యత్తు కోసం పర్యావరణహిత అలవాట్లు అలవర్చుకోవాలని సిబ్బందిని కోరారు. ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ, ఆయన మొబైల్ పబ్లిసిటీ వాన్‌ను ప్రారంభించారు. ఈ వాహనం ద్వారా ప్రజలకు ఎల్‌.ఐ‌.సి. పథకాలు, సేవలపై అవగాహన కల్పించడమే కాకుండా, కొత్తగా ప్రారంభించిన ‘బీమా సఖి’ మహిళా కెరీర్ ఏజెన్సీని ప్రచారం చేయనున్నారు. ఈ ఏజెన్సీ ద్వారా మహిళలకు ఉపాధి అవకాశాలు, ఆర్థిక స్వావలంబన లభిస్తాయి. కార్యక్రమంలో సీనియర్ అధికారులు శ్రీ పి.జి. కుమారా వైద్యలింగం, శ్రీ ఎస్. సర్వణ రమేష్, శ్రీ ఎ.ఎ.ఎం. హిలాలి, శ్రీమతి కె. సాంధ్య రాణి పాల్గొన్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *