Chevella

Chevella: చేవెళ్లలో డ్రగ్స్ కలకలం.. ఆరుగురు ఐటీ ఉద్యోగుల అరెస్ట్‌

Chevella: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ప్రాంతంలో డ్రగ్స్ కలకలం సృష్టించింది. సెరీన్ ఆచార్జ్ ఫామ్‌హౌస్‌లో జరుగుతున్న ఓ పుట్టినరోజు వేడుకలో డ్రగ్స్, విదేశీ మద్యం పట్టుబడటంతో పోలీసులు చర్యలు చేపట్టారు.

పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఫామ్‌హౌస్‌పై ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో సుమారు రూ. 2 లక్షల విలువ చేసే డ్రగ్స్‌తో పాటు మూడు కార్లను స్వాధీనం చేసుకున్నారు. పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న వారందరికీ డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా, ఆరుగురు ఐటీ ఉద్యోగులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో పోలీసులు వారిని వెంటనే అరెస్ట్ చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Delhi: బనకచర్ల పై రాజ్యసభలో ప్రస్తావన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *