CM Chandrababu Singapore Tour

CM Chandrababu Singapore Tour: రికార్డులు సరిచేసేందుకే వచ్చా.. సింగపూర్‌ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు కీలక వాక్యాలు

CM Chandrababu Singapore Tour: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సింగపూర్ పర్యటనలో రెండో రోజున కీలక సమావేశాలు నిర్వహించారు. “రికార్డులు సెట్ చేయడానికే సింగపూర్‌కు వచ్చాను” అని స్పష్టంగా చెప్పారు చంద్రబాబు. సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ టాన్ సీ లెంగ్తో ఆయన సమావేశమయ్యారు.

ఈ భేటీలో ముఖ్యంగా గత ప్రభుత్వ కాలంలో సింగపూర్ సంస్థలు ఎదుర్కొన్న సమస్యలపై చర్చ జరిగింది. అవే మళ్లీ జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు చంద్రబాబు. సింగపూర్‌పై తనకున్న అభిమానంతో గతంలో హైదరాబాద్‌లో సింగపూర్ టౌన్‌షిప్ నిర్మించామని గుర్తు చేశారు.

ఏపీకి సింగపూర్ భాగస్వామ్యం అవసరం

చంద్రబాబు మాట్లాడుతూ, మానవ వనరులు, సైన్స్ అండ్ టెక్నాలజీ, వ్యాపార రంగాల్లో సింగపూర్ భాగస్వామ్యం రాష్ట్రానికి చాలా అవసరమని చెప్పారు. ప్రపంచంలో ఎన్నో దేశాల్లో ఆంధ్రప్రదేశ్‌ నిపుణులు తమ ప్రతిభను చూపిస్తున్నారని తెలిపారు.

గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, పోర్టులు, ట్రాన్స్‌మిషన్ కారిడార్‌లు, డేటా సెంటర్లు, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో సింగపూర్ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. విశాఖపట్నంలో నవంబరులో జరుగనున్న భాగస్వామ్య సదస్సుకు హాజరుకావాలని కూడా మంత్రి టాన్ సీ లెంగ్‌ను ఆహ్వానించారు.

ఇది కూడా చదవండి: UP temple: ఉత్తర్‌ప్రదేశ్‌ ఆలయంలో విద్యుత్‌షాక్‌, తొక్కిసలాట.. ఇద్దరు మృతి, 40 మందికి పైగా గాయాలు

సింగపూర్ మంత్రి స్పందన

ఈ సందర్భంగా టాన్ సీ లెంగ్ మాట్లాడుతూ, “గతంలోనే నేను హైదరాబాద్‌ వచ్చాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌తో కలిసి పని చేయడానికి ఆసక్తిగా ఉన్నాం” అని చెప్పారు. ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ, సబ్ సీ కేబుల్స్, హౌసింగ్ ప్రాజెక్టుల రంగాల్లో కలిసి పనిచేయాలనుకుంటున్నామని పేర్కొన్నారు.

సభలో పాల్గొన్న అధికారులు

ఈ సమావేశానికి నారా లోకేష్, నారాయణ, టీజీ భరత్ వంటి మంత్రులతో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Pawan Kalyan: మహా న్యూస్ ఆఫీస్‌పై దాడి గర్హనీయం: పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *