Nara lokesh: లోకేశ్ కీలక సూచనలు: ప్రజల మద్దతే పార్టీ భవిష్యత్‌కు బలంకారం

Nara lokesh: తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ శ్రేణులు అలసత్వం ప్రదర్శించకూడదని, ప్రజలతో నిరంతరం మమేకమవుతూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ, గత ప్రభుత్వ అహంకారమే ఓటమికి కారణమైందని హెచ్చరించారు.

‘ఇంటింటికీ తెలుగుదేశం’ – సుపరిపాలనకు కొత్త కార్యక్రమ

పార్టీ పాలనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు “సుపరిపాలనలో తొలి అడుగు – ఇంటింటికీ తెలుగుదేశం” అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు లోకేశ్ ప్రకటించారు. నెల రోజుల పాటు నిర్వహించబోయే ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల گھరాలకు వెళ్లి ప్రభుత్వ విజయాలు, సంక్షేమ పథకాలను వివరించనున్నారు.

విజయానికి శ్రమించిన వారిని మరవొద్దు

ఎన్నికల విజయానికి కృషిచేసిన కార్యకర్తల కృషిని గుర్తుచేస్తూ, వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించరాదని లోకేశ్ చెప్పారు. “151 సీట్లతో గెలిచిన పార్టీ 11కే పరిమితమవుతే, దానికి అహంకారమే కారణం. మనం అదే తప్పు చేయకూడదు. అధికారంలో ఉన్నా, ప్రజలతో మమేకమవుతూ ఉంటేనే విశ్వాసం పొందగలుగుతాం” అని హితవు పలికారు.

సంస్థాగత నిర్మాణానికి గడువు

పార్టీ వ్యవస్థను బలోపేతం చేయాలని, జూలై 5వ తేదీ వరకు అన్ని కమిటీలను పూర్తి చేయాలని లోకేశ్ స్పష్టమైన గడువును నిర్ణయించారు. మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి అన్ని కార్యకలాపాల్లో భాగస్వాములను చేయాలని ఆయన సూచించారు. వృద్ధుల అనుభవం, యువత ఉత్సాహం కలగలిపితే పార్టీ మరింత శక్తివంతమవుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

కార్యాలయం ఓ పవిత్ర స్థానం

“ప్రపంచం అంతా తిరిగినా, తిరిగి వస్తే మనం చేరేది పార్టీ కార్యాలయానికే. అలాంటి కార్యాలయంపై గతంలో జరిగిన దాడులు ఎంత బాధాకరమో మనం చూశాం” అని గుర్తుచేస్తూ, కార్యకర్తలు పార్టీ పిలుపులను సీరియస్‌గా తీసుకోవాలని, ప్రజలే తమ భవిష్యత్‌ను నిర్ణయిస్తారని స్పష్టం చేశారు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *