WEATHER : మత్స్యకారులు అలర్ట్.. 50 కిలోమీటర్ల వేగంతో గాలులు..

WEATHER: ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఇవి కశ్మీర్, సిమ్లా మార్గంగా హిమాలయాల వరకు విస్తరిస్తూ ఉన్నాయి. మరో రెండు మూడు రోజులలో దేశమంతటా ఈ వాయుగుండాలు వ్యాపించనున్నాయని భారత వాతావరణ శాఖ, విశాఖపట్నం శాఖ తెలిపింది. ఈ సారి రుతుపవనాలు సాధారణ కంటే సుమారు 15 రోజులు ముందుగానే వచ్చాయని ప్రత్యేకంగా వెల్లడించారు.

ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సుమారు 5.8 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తులో వ్యాపించింది. దీంతో వచ్చే రెండు రోజులలో దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని సూచిస్తున్నారు.

ఉత్తర కోస్తాంధ్రలో ఒకటి రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే సూచనలు ఉన్నాయి. గాలులు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. అందుకే మత్స్యకారులు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాల కారణంగా వ్యవసాయానికి అనుకూల వాతావరణం ఏర్పడనున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *