RajaSaab: పాన్ ఇండియా ఐకాన్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం దర్శకుడు మారుతి రూపొందిస్తున్న హారర్ కామెడీ చిత్రం ‘ది రాజాసాబ్’ షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తికాగా, ప్రభాస్ ఈ ప్రాజెక్ట్ కోసం ఓ ఆసక్తికర నిర్ణయం తీసుకున్నాడు. టి.జి. విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం ప్రభాస్ తన రూ.150 కోట్ల రెగ్యులర్ రెమ్యునరేషన్ను రూ.100 కోట్లకు తగ్గించాడు.
Also Read: Rashmika Mandanna: విజయ్ ఇంట్లో రష్మిక.. అత్తగారు ఇచ్చిన చీర అంటూ పోస్ట్..!
RajaSaab: దీని వెనుక కారణం ఆదిపురుష్. గతంలో ఈ నిర్మాత ఆదిపురుష్తో నష్టాలు చవిచూశారు. దీంతో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి సపోర్ట్గా ప్రభాస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధిస్తుందని అభిమానులతో పాటు చిత్ర బృందం ధీమాగా ఉంది. ప్రభాస్ లుక్, మారుతి మార్క్ కామెడీ, హారర్ ఎలిమెంట్స్ కలగలిపిన ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.

