Bhagyashri Borse

Bhagyashri Borse: టాలీవుడ్ న్యూ టాప్ హీరోయిన్‌గా భాగ్య శ్రీ బోర్స్.. ఆకాశాన్నంటుతోన్న డిమాండ్!

Bhagyashri Borse: బాలీవుడ్‌లో ఒకే సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న భాగ్య శ్రీ బోర్స్, టాలీవుడ్‌లో దూసుకెళ్తోంది. డైరెక్టర్ హరీష్ శంకర్ దృష్టిలో పడిన ఈ అమ్మాయి, ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోలేకపోయినా, భాగ్య శ్రీ గ్లామర్, నటనతో ఆడియన్స్‌ను ఆకర్షించింది. హరీష్ శంకర్ సినిమాలు హీరోయిన్స్‌కు కెరీర్‌లో బూస్ట్ ఇస్తాయని శృతి హాసన్, పూజా హెగ్దేల ఉదాహరణలు చెబుతున్నాయి.

ప్రస్తుతం భాగ్య శ్రీ మూడు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. విజయ్ దేవరకొండతో ‘కింగ్డమ్’, రామ్‌తో ‘ఆంధ్రా కింగ్’, దుల్కర్ సల్మాన్‌తో తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం ‘కాంత’లో నటిస్తోంది. ఈ సినిమాలతో ఆమె ప్రేక్షకులకు మరింత చేరువ కానుంది.

Also Read: Jayam Ravi Aarti: జయం రవి విడాకుల గందరగోళం.. భారీ భరణం డిమాండ్‌తో కలకలం?

Bhagyashri Borse: ఇప్పటికే మరో రెండు ప్రాజెక్టులు లైన్‌లో ఉన్నాయని, ఆరు నెలల వరకు కొత్త ఆఫర్లు స్వీకరించలేనని ఆమె చెప్పినట్లు సమాచారం. హిట్ లేకపోయినా భాగ్య శ్రీ డిమాండ్ ఆకాశాన్నంటుతోంది. రాబోయే సినిమాల్లో ఒక్కటి క్లిక్ అయినా, ఆమె టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా ఎదిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ స్టార్ మెటీరియల్‌ను మేకర్స్ ఎలా వాడుకుంటారో చూడాలి!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *