Nayanthara : ఆ సినిమా నా జీవితాన్ని మార్చేసింది … భర్తకు నయన్ థ్యాంక్స్

నయన్ – విఘ్నేశ్ రెండున్నరేళ్ల క్రితం వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. వీళ్లకు ఉయిర్, ఉలగమ్ అనే ట్విన్స్ ఉన్నారు. నిజానికి వీళ్ల ప్రేమ చిగురించింది ఓ సినిమాతో… అదే ‘నేను రౌడీనే ‘మూవీ. విఘ్నేశ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించింది. అలా వీరి పరిచయం అప్పుడు ఏర్పడింది. ఆ సినిమా విడుదలై 9 ఏళ్లు పూర్తైన సందర్భంగా విఘ్నేశ్కు థ్యాంక్స్ చెబుతూ నయనతార ఓ స్పెషల్ పోస్ట్ పెట్టారు.

‘నా జీవితాన్ని శాశ్వతంగా మార్చేసిన చిత్రం. నా కెరీర్ ను గొప్పగా మలచిన సినిమా ‘నేను రౌడినే’. 9 ఏళ్ల కిత్రం విడుదలై విజయాన్ని సొంతం చేసుకొని మర్చిపోలేని అనుభూతుల్ని అందించింది. ఈ విషయంలో ప్రేక్షకులకు రుణపడి ఉంటాను. ఇలాంటి గొప్ప సినిమాలో అవకాశం ఇచ్చినందుకు విఘ్నేశ్ కు కృతజ్ఞతలు. దీని నుంచి నటిగా కొత్త అనుభవాలు నేర్చుకున్నాను. ఈ సినిమా నాకు విఘ్నేశ్ ను ఇచ్చింది’అని నయన్ పేర్కొంది.

ఇక ఈ చిత్రం గురించి గతంలో విఘ్నేశ్‌ మాట్లాడుతూ.. “నేను రౌడినే’ సినిమాలో హీరోయిన్‌గా నయనతార అయితే బాగుంటుందని ధనుష్‌ చెప్పారు. దీంతో ఆమెకు కథ వినిపించాను. వెంటనే ఓకే చేసింది. చిత్రీకరణకు సంవత్సరం పట్టింది. ఆ యేడాదంతా ఆమెతో ఉండే అవకాశం వచ్చింది. తన ఇష్టాయిష్టాలను తెలుసుకునే సమయం దొరికింది” అని చెప్పారు.

ఈ సినిమా చిత్రీకరణకు సంవత్సరం పట్టింది. ఆ ఏడాదంతా వీళ్లిద్దరూ తమ ఇష్టాయిష్టాలను షేర్ చేసుకునే అవకాశం దొరికింది. 2015లో విడుదలైన ‘నేను రౌడినే’లో విజయ్ సేతుపతి హీరోగా నటించారు. ఈ చిత్రం షూటింగ్ లోనే నయనతార, విఘ్నేశ్ లు స్నేహితులయ్యారు. వారి స్నేహం ప్రేమగా మారి వివాహబంధంతో ఒక్కటయ్యారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Daaku Maharaj: పవర్ ఫుల్ బీట్ తో ‘డాకు మహారాజ్’ ఫస్ట్ సింగిల్ ప్రోమో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *