train accident: కామఖ్య ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పిన సంఘటన ఒడిశాలోని కటక్ జిల్లాలో జరిగింది. ఆదివారం ఉదయం 11:54 గంటల సమయంలో కర్ణాటక రాజధాని బెంగళూరునుంచి అస్సాం రాజధాని గౌహతిలోని కామధ్య స్టేషన్కు వెళ్ళిపోతున్న కామధ్య ఎక్స్ప్రెస్ రైలు నిర్గుండి రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 11 బోగీలు పట్టాల పక్కకు ఒరిగాయి.
ఈ ప్రమాదంలో కొంతమంది ప్రయాణికులు గాయపడినట్లు తెలుస్తోంది. గాయపడ్డ వారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రైల్వే అధికారులు సహాయక చర్యలు చేపట్టి, ప్రమాదం కారణంగా ప్రయాణీకులకు మరింత ఇబ్బందులు ఏర్పడకుండా చర్యలు తీసుకుంటున్నారు.