KTR: BRS హయాంలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకెళ్లింది తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు చేశాం కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగింది కానీ..తెలంగాణ బడ్జెట్లో మాత్రం ఆ ప్రస్తావన లేదు 2014-2022 వరకు తెలంగాణ వృద్ధిరేటు 17.57శాతం అధికారంలో ఏ పార్టీ ఉన్నా.. తెలంగాణ బాగుండాలన్నదే మా సంకల్పం పదవులు శాశ్వతం కాదు..అధికారం ఎవరికీ శాశ్వతం కాదు ఇటీవలే సెక్రటేరియట్, అసెంబ్లీలు కట్టుకున్నాం తెలంగాణ పథకాలను కేంద్రం అనుకరిస్తోంది. తెలంగాణ పథకాలను కేంద్రం కాపీ కొట్టింది మనకు జరిగిన అన్యాయంపై.. డిప్యూటీ సీఎం మాట్లాడకపోవడం బాధేసింది. పార్లమెంట్లో ఎన్నికల్లో..మాకు ఒక్క సీటు కూడా రాలేదని విమర్శించారు.
మాకు వచ్చిందే సున్నానే..మరి కేంద్ర బడ్జెట్లో.. తెలంగాణకు వచ్చింది గుండు సున్నా కాదా కొట్లాడకపోతే కేంద్రం నిధులు కూడా ఇవ్వదు..పోరాడాల్సిందే కేంద్రంతో గట్టిగా మాట్లాడేందుకు మేము కూడా మద్దతిస్తాం సత్సంబంధాలు ఉండాలని సీఎం రేవంత్రెడ్డి అంటున్నారు. మేము కూడా కేంద్రంతో సఖ్యతతో ఉన్నాం..ఏమీ రాలేదు ఎన్నికల కోసమే కేంద్రమంత్రులు తెలంగాణకు వస్తారు
తెలంగాణ పుట్టుకనే బీజేపీ నేతలు ప్రశ్నించారు. విభజన సమస్యలను ఇప్పటికీ పరిష్కరించలేదు పసుపు బోర్డుకు కేంద్రం నిధులు కేటాయించలేదు. ఐటీఐఆర్ను రద్దు చేశారు, చేనేత మీద జీఎఎస్టీ వేస్తే అడగొద్దా.
KTR: తెలంగాణకు కేంద్రం ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు సమ్మక్క సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించాలి.కుంభమేళాకు కేంద్రం నిధులు ఇస్తుంది.. సమ్మక్క-సారలమ్మ జాతరకు ఎందుకు నిధులు ఇవ్వరు బీఆర్ఎస్పై కాంగ్రెస్ దుష్ప్రచారం చేసింది. తాము రేషన్ కార్డు ఇవ్వలేదని ప్రచారం చేశారు వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టనివ్వలేదు వైజాగ్ స్టీల్ప్లాంట్కు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారు.. కానీ తెలంగాణలోని పరిశ్రమలను మాత్రం మూసివేస్తారు.
KTR: తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్రమంత్రులు ఉన్నారు.. ఒకరు సహాయ మంత్రి..ఇంకొకరు అసహాయ మంత్రి రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే కేంద్రమంత్రులు మాట్లాడరు. తెలంగాణ ఆలయాలకు ఒక్క రూపాయి తెచ్చారా? సీఎం రేవంత్..వన్ ట్రిలియన్ ఎకానమీ అంటున్నారు. ప్రస్తుత అంచనాలతో ఇది ఎలా సాధ్యమవుతుందో చెప్పాలి పదేళ్లలో ఆర్థిక అరాచకత్వం జరిగిందని ప్రచారం చేశారు. ఒక్క ఏడాదిలోనే కాంగ్రెస్ సర్కార్.. రూ.1.50లక్షల కోట్లు అప్పు చేసింది. మా హయాంలో ఏడాదికి రూ.40వేల కోట్లు మాత్రమే అప్పు చేశాం. అప్పు చేసి అభివృద్ధి చేశాం..ఈ విషయాన్నే కాగ్ చెప్పింది.
కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వట్లేదు అప్పులు తెచ్చి పెట్టుబడి పెడితే.. దానితో అభివృద్ధి జరుగుతుంది. అప్పులులేని దేశం కానీ, వ్యక్తి కానీ ఉండరు. అప్పులకు తగినట్లే రాష్ట్ర సంపద కూడా పెరిగింది అప్పుల గురించి మాట్లాడే కాంగ్రెస్ నేతలు.. పెరిగిన ఆస్తుల గురించి కూడా మాట్లాడాలి రాష్ట్రం దివాలా తీసింది అనటానికి ఆధారాలు లేవు కరోనా సమయంలో ఉద్యోగులు, ఎమ్మెల్యే,.. మంత్రుల జీతాలు ఆలస్యమయ్యాయి కాంగ్రెస్, బీజేపీల నుంచి 8+8 ఎంపీలు=గుండుసున్నా అన్ని కేటీఆర్ ఫైర్ అయ్యారు.
