Theft

Theft: కారు అద్దాలు పగలగొట్టి లక్షలు లేపేశారు

Theft: కారు అద్దాలు పగలగొట్టి 33 లక్షల రూపాయలు దొంగిలించి ఓ రహస్య ముఠా పరారైంది. హవేరీకి చెందిన సంతోష్ అనే వ్యక్తి నిన్న మధ్యాహ్నం తన ఇంటికి సమీపంలోని బ్యాంకుకు వెళ్లి 33 లక్షల రూపాయలు డ్రా చేసుకున్నాడు. దాన్ని కారులో పెట్టి ఇంటికి వచ్చాడు. అతను కారును తలుపు దగ్గర ఆపి లోపలికి వెళ్ళాడు.

ఇది కూడా చదవండి: Delhi High Court: అమ్మాయి పెదవులు పట్టుకుంటే లైంగిక వేధింపు కాదంట!ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు..

ఇది గమనించిన ఆ ముఠా కారు అద్దాలు పగలగొట్టి, డబ్బు దొంగిలించి పారిపోయింది. కొంతసేపటి తర్వాత, సంతోష్ బయటకు వచ్చి చూసేసరికి, డబ్బు దొంగిలించబడిందని గుర్తించాడు. ఇంట్లో అమర్చిన నిఘా కెమెరాను పరిశీలించగా, రెండు బైక్‌లపై వచ్చిన నలుగురు వ్యక్తులు కారు అద్దాలు పగలగొట్టి డబ్బు దొంగిలిస్తున్నట్లు రికార్డైంది.బాధితుడు హవేరి నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో . పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Hyderabad: HCU లో తీవ్ర ఉద్రిక్తత.. ఆందోళనకు దిగిన విద్యార్థులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *