Telangana assembly: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల (మార్చి)లోనే ప్రారంభంకానున్నాయి. ఈ నెల 12వ తేదీగా ముహూర్తం ఖరారు చేశారు. ఈ అసెంబ్లీ బడ్టెట్ సమావేశాలు ఇదే నెల 27 వరకు కొనసాగుతాయి. నిన్న సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర క్యాబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సుదీర్ఘంగా కొనసాగిన క్యాబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Telangana assembly: రాష్ట్రంలో కొత్తగా రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు, కొత్త మండలాలకు 217 పోస్టుల మంజూరు, 10,950 విలేజ్ లెవల్ ఆఫీసర్ పోస్టులను మంజూరు చేస్తూ రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు. అదే విధంగా 10 జిల్లా కోర్టులకు 55 పోస్టుల మంజూరుకు కూడా మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
Telangana assembly: ఇదిలా ఉండగా, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బృందం శుక్రవారం మరోసారి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నది. సీఎం రేవంత్రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సహా, ఎంపీలు, ఎమ్మెల్యేలు వెళ్లనున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఆశావహుల సంఖ్య భారీగా పెరగడంతో ముఖ్య నేతలు తలలు పట్టుకుంటున్నారు. దీంతో ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించే అవకాశం ఉన్నది.