Shocking Video

Shocking Video: పెళ్లింట విషాదం.. స్టేజ్‌పై డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన యువతి

Shocking Video: కరోనా తర్వాత గుండెపోటుతో చనిపోయే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా మధ్యప్రదేశ్ లో ఓ విషాద సంఘటన చోటుచేసుకుంది. డ్యాన్స్ చేస్తూ ఓ యువతి ఒక్కసారిగా కుప్పకూలింది. గుండెపోటు కారణంగానే ఆమె చనిపోయిందని అనుమానిస్తున్నారు. అయితే కొన్నాళ్ల క్రితం ఆమె సోదరుడు కూడా గుండెపోటుతోనే ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పుడు మళ్లీ అదే కుటుంబంలో ఓ వ్యక్తి హార్ట్ ఎటాక్ తో మరణించడం హాట్ టాపిక్ గా మారింది. 

మధ్యప్రదేశ్‌లోని విదిష జిల్లాలో జరిగిన ఒక వివాహ వేడుకలో వేదికపై నృత్యం చేస్తూ  యువతి మరణించిన విషాద సంఘటన ఫిబ్రవరి 9న సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అయిన ఓ వీడియో ద్వారా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అందిన సమాచారం ప్రకారం.. మృతురాలిని ఇండోర్ నివాసి పరిణీతగా గుర్తించారు. ఆమె తన బంధువుల్లో ఒకరి వివాహానికి హాజరు కావడానికి విదిషకు వెళ్లింది.

ఈ సంఘటన శనివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో జరిగిందని చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఇందులో పరిణీత వేదికపై ఓ పాటకు ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్నట్లు కనిపించింది. ఆ సమయంలోనే ఆమె అకస్మాత్తుగా వేదికపై కుప్పకూలింది. ఆమె డ్యాన్స్ చేస్తుండగా గుండెపోటు వచ్చి ఉంటుందని, దాని కారణంగానే వేదికపై ఆమె ఆకస్మికంగా మరణించి ఉంటుందని పలువురు అనుమానిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Thalapathy Vijay: విజయ్ కీలక నిర్ణయం.. ప్రశాంత్ కిషోర్‌తో భేటీ

సంగీత్ వేడుక రాత్రి 9 గంటలకు ప్రారంభం కాగా, ఈ ఘటన 10 గంటల ప్రాంతంలో జరిగింది. అయితే ఆమె ఒక్కసారిగా అలా స్టేజీపై కుప్పకూలడంతో వివాహానికి హాజరైన బంధువులు కొందరు వైద్యులు వెంటనే సీపీఆర్ చేసి ఆమెను బతికించడానికి ప్రయత్నించారు. కానీ ఎలాంటి ఫలితం కనిపించలేదు. ఆ తర్వాత ఆమెను విదిషలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు, మరణించినట్లు ప్రకటించారు. ఆమె మరణం తరువాత, వివాహ ఆచారాలు రాత్రి సమయంలో పూర్తయ్యాయి.ఆమె బంధువులు చాలా మంది విదిషలో ఉండటంతో, ఆమె అంత్యక్రియలు కూడా అక్కడే జరిగాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *