Secunderabad

Secunderabad: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ అక్రమ గంజాయి చాక్లెట్లు కలకలం

Secunderabad: కొందరు బేవార్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. పచ్చ నోట్లకు బాగా అలవాటు పడి..పసి ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ఏకంగా చాకోలెట్స్ ముసుగులో …మత్తు మందు అమ్మేస్తున్నారు. ఒకటి రెండు కాదు ఏకంగా కేజీల కొద్దీ సరకు దొరికింది అంటే …పరిస్థితి ఏంటో అర్తం అవుతుంది. ఒక్కసారి మీ పిల్లలు తినే చాకోలెట్స్ ఎలాంటివి ? అనేది ఒకసారి చూడండి. లేకుంటే…భవిష్యత్తు దారుణంగా ఉంటుంది

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో అక్రమంగా గంజాయి చాక్లెట్లు తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 24 కిలోల గంజాయి చాక్లెట్‌ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాలిలా ప్రకారం… ఉత్తర ప్రదేశ్‌కు చెందిన గోరక్‌ అనే వ్యక్తి రాజస్థాన్ నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా గంజాయి చాక్లెట్లు తరలించి నగరంలోని పలు ప్రాంతాల్లో విక్రయిస్తున్నాడు. ఇదే క్రమంలో రాజస్థాన్ నుంచి గంజాయి చాక్లెట్లు తీసుకుని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో దిగాడు..

అక్కడ నుంచి ఈ చాక్లెట్లను కూకట్‌పల్లిలోని ఓ షాపులో ఇచ్చేందుకు బస్సు కోసం వేచి ఉండగా.. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని విచారించగా.. ఆయన వద్ద 24 కిలోల గంజాయి చాక్లెట్‌ ఫ్యాకెట్లు లభించాయి.. చాక్లెట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడు గోరక్‌ను అరెస్ట్ చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *