Chhattisgarh: ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్‌కౌంటర్‌

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. అబూజ్‌మడ్‌ అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య తీవ్ర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావోయిస్టులు మృతిచెందారు. దంతేవాడ, నారాయణపూర్‌ సరిహద్దుల్లో ఉన్న దక్షిణ అబూజ్‌మడ్‌ అడవుల్లో భద్రతా సిబ్బంది మావోయిస్టుల కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో మావోయిస్టులు పోలీసులకు ఎదురుపడినప్పుడు కాల్పులు జరిగాయి. ప్రతిగా భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మరణించారు.

ఈ ఎన్‌కౌంటర్ గురువారం ఉదయం 3 గంటల నుండి కొనసాగుతుందని బస్తర్‌ పోలీసులు తెలిపారు. కూంబింగ్ ఆపరేషన్‌లో నారాయణపూర్‌, దంతేవాడ, జగదల్‌పూర్‌, కొండగాల్‌ జిల్లాల భద్రతా బలగాలతోపాటు, డీఆర్‌జీ, ఎస్‌టీఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌ బలగాలు కూడా పాల్గొన్నాయి.

కాగా నవంబర్ 30న ములుగు జిల్లా చెల్పాక-ఐలాపూర్‌ అటవీ ప్రాంతంలో జరిగిన ఘోర ఎన్‌కౌంటర్‌కు సంబంధించి, మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన పోరులో 7 మావోయిస్టులు మరణించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *