Jaishankar

Jaishankar: స్వతంత్ర పాలస్తీనాకు భారత్ మద్దతు

Jaishankar: విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈరోజు పార్లమెంటులో సార్వభౌమ మరియు స్వతంత్ర పాలస్తీనా రాజ్యానికి భారతదేశం మద్దతును పునరుద్ఘాటించారు. ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదానికి ముగింపు పలికేందుకు, ప్రత్యేక పాలస్తీనా దేశాన్ని ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి భారత్ రెండు దేశాల పరిష్కారానికి మద్దతునిస్తూనే ఉందని ఆయన అన్నారు.

ఇది కూడా చదవండి: Chandrababu: 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను నాలెడ్జ్ హబ్‌

Jaishankar: అయితే, ఇజ్రాయెల్ బందీల సమస్యలను కూడా తక్కువ అంచనా వేయలేమని లేదా విస్మరించలేమని విదేశాంగ మంత్రి అన్నారు. ఇజ్రాయెల్‌తో రక్షణ భాగస్వామ్యాన్నిసమర్ధించుకున్నారు. ఈ సందర్భంగా  జైశంకర్ మాట్లాడుతూ- ఇజ్రాయెల్ జాతీయ భద్రతలో సహకారానికి బలమైన రికార్డును కలిగి ఉన్న దేశం. మన దేశ భద్రత ప్రమాదంలో ఉన్నప్పుడు కూడా ఇజ్రాయెల్ మనకు అండగా నిలిచింది అని చెప్పారు. మేము ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు, పెద్ద సమస్యలను దృష్టిలో ఉంచుకుంటాము, అదే సందర్భంలో  మన జాతీయ భద్రత ప్రయోజనాలను కూడా దృష్టిలో ఉంచుకుంటాము.” అని మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *