Urvil Patel: ఐపీఎల్ లో అన్ సోల్డ్ గా మిగిలిపోయిన కసి అంతా మైదానంలో చూపిస్తున్నాడు యువ వికెట్ కీపర్ ఉర్విల్ పటేల్. ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్లో గుజరాత్ తరఫున త్రిపురపై 28 బంతుల్లోనే సెంచరీ బాదిన ఈ ఓపెనర్.. తాజాగా ఉత్తరాఖండ్పై 36 బంతుల్లోనే శతకం సాధించాడు.టీ20ల్లో 40 బంతుల్లోపు రెండు శతకాలు సాధించిన తొలి బ్యాటర్గా ఉర్విల్ రికార్డు నెలకొల్పాడు.
Urvil Patel: సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో గుజరాత్ వికెట్ కీపర్ బ్యాటర్ ఉర్విల్ పటేల్ భీకర ఫామ్ కొనసాగుతోంది. ఈ టోర్నీలో ఇప్పటికే ఓ మెరుపు సెంచరీ బాదిన ఉర్విల్.. తాజాగా మరో సెంచరీతో సంచలనం సృష్టించాడు. ఉత్తరాఖండ్తోజరిగిన మ్యాచ్లో ఉర్విల్ 36 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్లో 41 బంతులు ఎదుర్కొన్న ఉర్విల్.. 8 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో అజేయమైన 115 పరుగులు చేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో గుజరాత్ తరఫున ఇదే అత్యధిక వ్యక్తిగతీ స్కోర్ ఇదే కావడం విశేషం. అంతేకాదు ఉర్విల్ గత త్రిపురతో జరిగిన మ్యాచ్లో కేవలం 28 బంతుల్లోనే సెంచరీ చేయగా.. భారత్ తరఫున టీ20ల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన బ్యాటర్ గా నిలవగా.. మళ్లీ తనే టీ20ల్లో రెండో వేగవంతమైన సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో ఉర్విల్.. క్రిస్ గేల్, రిషబ్ పంత్ రికార్డులను బద్దలు కొట్టాడు.
Urvil Patel: టీ20ల్లో గేల్ 30 బంతుల్లో 100 కొట్టగా.. పంత్ 32 బంతుల్లో సెంచరీ బాదాడు. కాగా, పొట్టి ఫార్మాట్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు ఎస్టోనియా ఆటగాడు సాహిల్ చౌహాన్ పేరిట ఉంది. చౌహాన్ ఈ ఏడాదే సైప్రస్తో జరిగిన మ్యాచ్లో 27 బంతుల్లో సెంచరీతో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు నెలకొల్పాడు. ఉర్విల్ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును కేవలం ఒక్క బంతితో మిస్ అయ్యాడు. అంతేకాదు భారత్ తరఫున లిస్ట్-ఏ క్రికెట్లోనూ సెకెండ్ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు ఉర్విల్ పేరిటే ఉంది. 2023 నవంబర్లో అరుణాచల్ ప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో ఉర్విల్ 41 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసాడు. లిస్ట్-ఏ క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు టీమిండియా మాజీ ఆటగాడు యూసఫ్ పఠాన్ పేరిట ఉంది. 2010లో మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్లో యూసఫ్ పఠాన్ 40 బంతుల్లో సెంచరీ బాదాడు.
Urvil Patel: ఉర్విల్ను 2023 ఐపీఎల్ సీజన్ వేలంలో గుజరాత్ టైటాన్స్ 20 లక్షల బేస్ ధరకు సొంతం చేసుకుంది. అయితే ఆ సీజన్లో ఉర్విల్కు ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా రాలేదు. ఉర్విల్ను గుజరాత్ టైటాన్స్ 2025 మెగా వేలానికి ముందు వదిలేసింది. కానీ రూ.30 లక్షల కనీస ధరతో ఉన్న అతడిని కొనేందుకు ఏ ఫ్రాంఛైజీ ముందుకు రాలేదు. దీంతో మెగా వేలంలో ఉర్విల్ అన్సోల్డ్గా మిగిలిపోయాడు. సమర్థ్ 54, ఆధిత్య తారే 54 పరుగులతో రాణించడంతో అర్ద సెంచరీలతో రాణించడంతో ఉత్తరాఖండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్.. ఉర్విల్ సుడిగాలి సెంచరీతో విరుచుకుపడటంతో కేవలం 13.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. గుజరాత్ ఇన్నింగ్స్లో ఆర్య దేశాయ్ 23, అక్షర్ పటేల్ 28 నాటౌట్ తో ఉర్విల్ కు సహకారం అందించారు. ఈ విజయంతో గుజరాత్ సయ్యద్ ముస్తాక్అలీటోర్నీలోవరుసగాఐదోవిజయాన్నినమోదుచేసింది.