Ap news: అవినీతి చర్యల కారణంగా ఐపీఎస్ అధికారి ఎన్.సంజయ్ సీఐడీ చీఫ్ పై సస్పెన్షన్ వేటు పడింది.సంజయ్ ఇంతకుముదు ఫైర్ డిపార్ట్ మెంట్ డీజీగా పనిచేశారు. ఆ సమయంలో రూ.1 కోటి మేర దుర్వినియోగం జరిగిందన్న విషయాన్ని విజిలెన్స్ శాఖ నిర్ధారించింది. పనులు పెద్దగా జరగకుండానే భారీ మొత్తంలో చెల్లింపులు చేసినట్టు గుర్తించింది. సౌత్రిక టెక్నాలజీస్ అండ్ ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థతో కలిసి సంజయ్… ఈ మేరకు దుర్వినియోగానికి పాల్పడినట్టు వెల్లడైంది. దీనిపై విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.
ఈ నివేదిక ఆధారంగా సంజయ్ పై సర్కారు సస్పెన్షన్ వేటు వేసింది. సంజయ్ హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లరాదని ఆదేశాలు జారీ చేసింది. దళితులకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై అవగాహన కల్పించే కార్యక్రమాల పేరిట ఆయన దుర్వినియోగానికి పాల్పడ్డట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలోనే ఆయన సస్పెండ్ అయ్యారు. కాగా, గత ప్రభుత్వ హయాంలో సీఐడీని రాజకీయ కక్ష సాధింపుల కోసం వాడుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి.